Yadadri Temple: సండే ఎఫెక్ట్ … యాదాద్రికి పోటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం సెలవు దినం కావడంతో తెలంగాణ తిరుపతిగా పేరున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతం నుంచి యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు. ఉదయం నుంచీ యాదాద్రి భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. తిరు మాఢవీధులు భక్తులతో నిండి పోయాయి. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. దర్శనం క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Also: Typhoon Nanmadol: జపాన్ను భయపెడుతున్న తుఫాన్.. 20 లక్షల మంది ప్రజలపై ప్రభావం
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
యాదాద్రి ఆలయం పునర్ వైభవం తర్వాత భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదం కూడా అధిక సంఖ్యలో అందుబాటులో వుంచుతున్నారు. గతంలో కంటే యాదాద్రి అద్భుతంగా తీర్చిదిద్దారు. పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ఆలయంలో బాహ్య ప్రాకారంలో తిరు మాఢవీధులతోపాటు తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురంతోపాటు త్రితలం, విమాన గోపురాలను కృష్ణశిలలతో మహాద్భుతంగా తీర్చిదిద్దారు.
గతంలో ప్రాకారాలు లేని ఆలయానికి ఇప్పుడు బాహ్య, అంతర ప్రాకారాలు నిర్మించారు. అష్టభుజి మండపాలతో ప్రధానాలయం కనువిందు చేస్తోంది. స్వామివారికి ప్రత్యేక రథశాల, ఆ పక్కనే లిప్టు, పడమర ప్రాంతంలో తిరుపతి తరహాలో వేంచేపు మండపం, తూర్పు ప్రాంతంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. గర్భాలయంలో నిలువెత్తు ఆళ్వారులు, స్వర్ణకాంతులతో తీర్చిదిద్దిన ముఖ మండపం భక్తులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ కు సమీపంలోనే యాదాద్రి వుండడంతో వీలైనన్ని సార్లు జనం అక్కడికి వెళుతున్నారు. ఇక సెలవు దినాల టైంలో చెప్పక్కర్లేదు. యాదాద్రి కొండపై ఎటుచూసినా జనమే భక్తజనం.
Read Also: PeddiReddy: ప్రభుత్వంపై బురద చల్లడమే టీడీపీకి పని.. వాస్తవాలు తెలుసుకోవాలి
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!