Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
- 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు.. ప్రజలు బెంబేలెత్తు
- రాయలసీమలో రికార్డు స్థాయి వేడి, వడగాల్పుల హెచ్చరిక
- తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్.. జిల్లాలకు అప్రమత్తం
- మూడు రోజుల్లో వర్షాలు.. స్వల్ప ఉపశమనం అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును చేరువవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెడుతుండగా, మధ్యాహ్న సమయానికి రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అటు వడగాల్పుల తీవ్రత కూడా తోడవడంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సుమారు 100 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ వంటి జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది.
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
KKR vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. కోల్కతా ఈరోజైనా ఖాతా తెరిచేనా?..
ఎండల తీవ్రత , వడదెబ్బ బారి నుండి రక్షణ పొందేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడం ఉత్తమం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలను తరచూ తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా వాడాలి.
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక చిన్న ఊరటనిచ్చే వార్తను కూడా అందించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి, వేడి నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Prashanth Neel 418: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
తాజావార్తలు
-
PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
-
Virat Kohli: వన్డే జట్టులో కోహ్లీ రికార్డుల వేట.. ఇంగ్లాడ్ పై ఆ ఘనత సాధిస్తాడా..?
-
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్ – బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
-
Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
-
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!