Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
- 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు.. ప్రజలు బెంబేలెత్తు
- రాయలసీమలో రికార్డు స్థాయి వేడి, వడగాల్పుల హెచ్చరిక
- తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్.. జిల్లాలకు అప్రమత్తం
- మూడు రోజుల్లో వర్షాలు.. స్వల్ప ఉపశమనం అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును చేరువవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెడుతుండగా, మధ్యాహ్న సమయానికి రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అటు వడగాల్పుల తీవ్రత కూడా తోడవడంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సుమారు 100 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ వంటి జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
KKR vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. కోల్కతా ఈరోజైనా ఖాతా తెరిచేనా?..
ఎండల తీవ్రత , వడదెబ్బ బారి నుండి రక్షణ పొందేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడం ఉత్తమం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలను తరచూ తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా వాడాలి.
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక చిన్న ఊరటనిచ్చే వార్తను కూడా అందించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి, వేడి నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Prashanth Neel 418: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!