Harish Rao : బడ్జెట్ పెరిగింది.. పనితీరు పెరగాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిలోఫర్, గాంధీ వైద్యులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. విభాగాల వారీగా నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్ పెరిగింది.. పనితీరు పెరగాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులకు, వైద్యులకు అదేశించారు. అంతేకాకుండా నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు.
మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలు పెరగాలని ఆయన వెల్లడించారు. సి-సెక్షన్లు తగ్గాలి, సాధారణ ప్రసవాలు పెరగాలని ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా వైద్య వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. రోగికి శ్రద్ధతో చికిత్స నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు.
Also Read
https://ntvtelugu.com/balka-suman-react-on-radisson-pub-police-raid/
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?