Harish Rao: కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉంది.. గెలిచే ప్రసక్తే లేదు.. హరీష్ రావు హాట్ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంది, అది గెలిచే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ అంటే కేసిఆర్ కు చాలా ఇష్టం, సెంటిమెంట్ ఉన్న ప్రాంతం అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువలి, విద్వంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీకి గెలవాలన్నారు. బీజేపీ బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించింది, 14 లక్షల కోట్లు మాపి చేసింది, పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదన్నారు. బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ, రైతుల ఉసురు పోసుకుందన్నారు. బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా, పిల్లలు బ్రతుకుతారా? అని ప్రశ్నించారు. అయోధ్య రామాలయం బిజెపి కట్టిందా, ట్రస్ట్ కట్టింది, ఆలయ నిర్మాణానికి నేను కూడా 2 లక్షలు ఇచ్చానని తెలిపారు.
Read also: KTR: కేటీఆర్ పై టమాటాలతో దాడి.. 23 మంది పై కేసు నమోదు..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
నిన్న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది, 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడుగుతే ఐదు నెలల 12,500 ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెల్లెల్లు చెప్పండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ హుస్నాబాద్ కు వచ్చిందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడని అన్నారు. ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు, బండి సంజయ్ కి ఓటు వేస్తే అంత ఉత్తది అయిపోతుందన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంది, అది గెలిచే ప్రసక్తే లేదన్నారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డ నోట్ల కట్టలు.. రంగంలోకి ఐటీ శాఖ
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!