Bhatti Vikramarka : జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భట్టి విక్రమార్క డిమాండ్లు
- జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- జీఎస్టీ రేట్ల తగ్గింపుతో రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ లోటును కేంద్రమే భర్తీ చేయాలి
- ఐదేళ్లపాటు నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు భర్తీ చేయాలి
- సిన్ ట్యాక్స్ మొత్తాన్ని రాష్ట్రాలకు అందజేయాలి. -భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ఢిల్లీలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్రం భర్తీ చేయాలని ఆయన స్పష్టంగా చెప్పారు. కనీసం ఐదేళ్లపాటు ఈ నష్టపరిహారం రాష్ట్రాలకు అందాలని డిమాండ్ చేశారు. అలాగే, ‘సిన్ టాక్స్’ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు మళ్లించాలని కోరారు.
Nara Lokesh : “నేను ఎవ్వరిని వదిలిపెట్టను.. రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది”
Also Read
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
జీఎస్టీ తగ్గింపు కారణంగా రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వైద్య, విద్య, సంక్షేమ పథకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రాలకు స్వంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితి లేదని గుర్తుచేసి, రాష్ట్రాలు కోల్పోతున్న రెవెన్యూను కేంద్ర ప్రభుత్వం రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో రాష్ట్రాల ఆదాయ భద్రతను కాపాడే చర్యలు తప్పనిసరిగా ఉండాలని హితవు పలికారు. కేంద్ర-రాష్ట్రాలు పరస్పర సహకారంతో పటిష్ట ఆర్థిక యంత్రాంగాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కొనసాగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేయకుండా ఈరోజే పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
YS Jagan: ఏపీలో యారియా కొరతపై.. మాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
తాజావార్తలు
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OnePlus Nord CE 6 Lite: వన్ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?