TSPSC Group 1: గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group 1: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని TSPSC తేల్చి చెప్పింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 9న పరీక్ష నిర్వహించేందుకు జూన్ 1 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు వచ్చాయి. దీంతో గ్రూప్-1కి దరఖాస్తు చేసుకున్న వారిలో నిరుద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చిందని, నిరుద్యోగులదీ అదే పరిస్థితి ఎదుర్కొన్నారన్నారు.
Read also: Heavy Rains: తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. 14 మంది మృతి..
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
ఎన్నికలకు సిద్ధం కాలేదని, ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు కనీసం రెండు నెలలపాటు ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని అభ్యర్థించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు. గ్రూప్-1 పరీక్షల పేరుతో గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పట్టభద్రులకు ఓటు వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఈ వాస్తవాన్ని ఎన్నికల సంఘం గ్రహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు బిల్ నాగరాజు యాదవ్, నాగేంద్రరావు, అవినాష్, చిలుకల రాకేష్ తదితరులున్నారు.
Read also: Israel air strike in rafah: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కనీసం 35 మంది మృతి
మరోవైపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో మొత్తం 536 ఖాళీల కోసం గ్రూప్ 1 స్థానాలకు రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష 9 జూన్ 2024న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో జరగనుంది, పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు TSPSC గ్రూప్ 1 పరీక్షకు హాజరు కావచ్చు. దరఖాస్తు ఫారమ్ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు తమ TSPSC గ్రూప్ 1 హాల్ టిక్కెట్ను పరీక్ష తేదీకి ముందు అధికారిక TSPSC వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ హాల్ టిక్కెట్ను డౌన్లోడ్ చేసి, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి, ఎందుకంటే ఇది పరీక్షకు కూర్చోవడానికి వారి అర్హతను ధృవీకరిస్తుంది.
Kavya Maran: కెమెరా కంట పడకుండా.. వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న కావ్య మారన్!
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!