Group 1 Mains Exam: ఒక్క నిమిషం ఆలస్యం.. అనుమతించని అధికారులు!
- గ్రూప్ 1 పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల ఆందోళన..
- నిమిషం ఆలస్యం అయినా లోనికి అనుమతించడం లేదని ఆగ్రహం..
- గేట్లు ఓపెన్ చేయాలని కోరిన అభ్యర్థులు- అనుమతించే ప్రసక్తే లేదన్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడు హాట్ టాపిక్. సుప్రీం కోర్టు తీర్పుతో అధికారుల అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు గ్రూప్ 1 పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులు జిల్లాల వ్యాప్తంగా 46 కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రూప్ 1 పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైన సమయంలో కొందరు విద్యార్థుల తీరు మాత్రం మారలేదు. గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను లోనికి అనుమతించం అని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. అయితే ముందు నుంచి అధికారులు నియమాలు పాటించాలని కోరుతున్న కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read also: Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్ స్టెప్పులు..
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమంతించలేదు.. కేంద్రాలకు గేట్లు వేశారు. ఒక్క నిమిషమే కదా.. లోనికి అనుమతించాలని అభ్యర్థులు కోరారు. మీకు అనుమతిస్తే సీసీ కెమెరాలు ఉంటాయి.. వాటి వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుందని అధికారులు తెలిపారు. మీరు ఏడ్చినా, ఏం చేసిన లోనికి మాత్రం అనుమతించేది లేదని స్పష్టం చేశారు. నియమాలు ఉంటాయని ముందునుంచి చెబుతున్నా.. దానిని ఉపయోగించకుండా ఇలా చేస్తే మీరే బాధపడాల్సి వస్తుందని సూచించారు. అయితే కోఠి, సికింద్రాబాద్, గంపేట, రంగారెడ్డి, గద్వాల్ జిల్లాలతో పాటు పలు పరీక్షలు కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళల చేశారు. అయినా అధికారులు.. అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Mahesh Kumar Goud: విద్యార్థులు హ్యాపీ గా పరీక్షలు రాసుకోండి.. మేము అండగా ఉన్నాం..
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!