Group 1 Mains Exam: ఒక్క నిమిషం ఆలస్యం.. అనుమతించని అధికారులు!
- గ్రూప్ 1 పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల ఆందోళన..
- నిమిషం ఆలస్యం అయినా లోనికి అనుమతించడం లేదని ఆగ్రహం..
- గేట్లు ఓపెన్ చేయాలని కోరిన అభ్యర్థులు- అనుమతించే ప్రసక్తే లేదన్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడు హాట్ టాపిక్. సుప్రీం కోర్టు తీర్పుతో అధికారుల అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు గ్రూప్ 1 పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులు జిల్లాల వ్యాప్తంగా 46 కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రూప్ 1 పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైన సమయంలో కొందరు విద్యార్థుల తీరు మాత్రం మారలేదు. గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను లోనికి అనుమతించం అని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. అయితే ముందు నుంచి అధికారులు నియమాలు పాటించాలని కోరుతున్న కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read also: Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్ స్టెప్పులు..
Also Read
పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమంతించలేదు.. కేంద్రాలకు గేట్లు వేశారు. ఒక్క నిమిషమే కదా.. లోనికి అనుమతించాలని అభ్యర్థులు కోరారు. మీకు అనుమతిస్తే సీసీ కెమెరాలు ఉంటాయి.. వాటి వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుందని అధికారులు తెలిపారు. మీరు ఏడ్చినా, ఏం చేసిన లోనికి మాత్రం అనుమతించేది లేదని స్పష్టం చేశారు. నియమాలు ఉంటాయని ముందునుంచి చెబుతున్నా.. దానిని ఉపయోగించకుండా ఇలా చేస్తే మీరే బాధపడాల్సి వస్తుందని సూచించారు. అయితే కోఠి, సికింద్రాబాద్, గంపేట, రంగారెడ్డి, గద్వాల్ జిల్లాలతో పాటు పలు పరీక్షలు కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళల చేశారు. అయినా అధికారులు.. అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Mahesh Kumar Goud: విద్యార్థులు హ్యాపీ గా పరీక్షలు రాసుకోండి.. మేము అండగా ఉన్నాం..
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!