Telangana Formation Day: నేడే రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు.. కార్యక్రమాల వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్ 2న దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏఏ కార్యక్రమాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమరవీరులకు నివాళులర్పించడంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Read also: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్స్ ఇవే.. అత్యంత నిలకడైన జట్టు పాకిస్తాన్!
Also Read
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
పోలీసు బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్, వందన సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ బృందాలకు అవార్డులు అందజేయనున్నారు. అవార్డు గ్రహీతలతో ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ఉదయం ముగుస్తుంది. అనంతరం ట్యాంక్బండ్పై సాయంత్రం వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణ హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్ ట్యాంక్బండ్కు చేరుకుని స్టాళ్లను సందర్శిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ గొప్పతనాన్ని చాటిచెప్పేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్నివాల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది కళాకారులు పాల్గొంటారు.
Read also: Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు 70 నిమిషాల పాటు ఇక్కడ వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద ఐదు వేల మందితో ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్బండ్కు ఒక చివర నుంచి మరో చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ ఫ్లాగ్ వాక్ సందర్భంగా 13.30 నిమిషాల నిడివితో జాతీయ గీతం ‘జయ జయహే తెలంగాణ’ పూర్తి వెర్షన్ను విడుదల చేస్తారు. అనంతరం గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను ప్రభుత్వం సన్మానించనుంది. రాత్రి 8.50 గంటలకు రంగుల బాణాసంచా ప్రదర్శన ఉంటుంది. అక్కడితో తెలంగాణ దశాబ్ద వేడుకలు ముగియనున్నాయి.
Astrology: జూన్ 02, ఆదివారం దినఫలాలు
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!