Telangana Formation Day: నేడే రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు.. కార్యక్రమాల వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్ 2న దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏఏ కార్యక్రమాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమరవీరులకు నివాళులర్పించడంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Read also: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్స్ ఇవే.. అత్యంత నిలకడైన జట్టు పాకిస్తాన్!
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
పోలీసు బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్, వందన సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ బృందాలకు అవార్డులు అందజేయనున్నారు. అవార్డు గ్రహీతలతో ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ఉదయం ముగుస్తుంది. అనంతరం ట్యాంక్బండ్పై సాయంత్రం వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణ హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్ ట్యాంక్బండ్కు చేరుకుని స్టాళ్లను సందర్శిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ గొప్పతనాన్ని చాటిచెప్పేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్నివాల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది కళాకారులు పాల్గొంటారు.
Read also: Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు 70 నిమిషాల పాటు ఇక్కడ వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద ఐదు వేల మందితో ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్బండ్కు ఒక చివర నుంచి మరో చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ ఫ్లాగ్ వాక్ సందర్భంగా 13.30 నిమిషాల నిడివితో జాతీయ గీతం ‘జయ జయహే తెలంగాణ’ పూర్తి వెర్షన్ను విడుదల చేస్తారు. అనంతరం గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను ప్రభుత్వం సన్మానించనుంది. రాత్రి 8.50 గంటలకు రంగుల బాణాసంచా ప్రదర్శన ఉంటుంది. అక్కడితో తెలంగాణ దశాబ్ద వేడుకలు ముగియనున్నాయి.
Astrology: జూన్ 02, ఆదివారం దినఫలాలు
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!