Breaking: ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం..! ఇవాళే రైతులకు భూములు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల పంపిణీకి రంగం సిద్ధం అయ్యిందా? రేపో మాపో ఆ భూములను సంబంధిత రైతులకు పంపిణీ చేస్తారా? అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది.. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని జమున హ్యాచరిస్ భూముల వ్యవహారం తేల్చేపనిలో అధికారులు ఉన్నారు.. అధికారులతో పలు దఫాలుగా కలెక్టర్ చర్చలు జరిపారు.. తూప్రాన్లో రాత్రంతా అధికారులు బిజీబిజీగా గడిపారు.. ఈటల భూముల పంపిణీ వ్యవహారంపై మూడు రోజులుగా కలెక్టర్ హరీష్తో కలిసి తహసీల్దారు, కార్యాలయ అధికారుల పనిచేస్తున్నారని చెబుతున్నారు.. ఈ రోజు, రేపు సంబంధిత రైతులకు భూములను పంపిణీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.. కబ్జా జరిగినట్టు తేల్చిన అధికారులు.. రైతుల భూముల్లో హద్దులు కూడా ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతోంది..
Read Also: Live : నిన్ను కూడా ఇలాగే కత్తులతో… ప్రధాని మోడీకి వార్నింగ్..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
అయితే, ఇప్పటికే రెండు సార్లు ఆ భూముల్లో సర్వే నిర్వహించారు అధికారులు.. 56 మంది రైతులకు సంబంధించిన 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు, గత కొన్ని రోజులుగా ప్రజాప్రతినిధులు, అధికారుల్ని కలుస్తూ వస్తున్నారు అచ్చంపేట రైతులు.. ఈ నేపథ్యంలో.. రేపో మాపో ఆ రైతులకు భూములను పంపిణీ చేస్తారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. కాగా, భూ కబ్జా ఆరోపణలు వచ్చిన తర్వాత మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ను తొలగించారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరారు.. ఇక, తన నియోజకవర్గం హుజురాబాద్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించి.. మరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓవైపు బీజేపీ జాతీయ మహాసభలు హైదరాబాద్ వేదికగా సాగనున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ రాబోతున్నారు.. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. ఈటల భూ పంపిణీ వ్యవహారం కాకరేపుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!