Hospital Negligence: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. సైనస్ చికిత్సతో బాలిక మృతి
Girl died due to negligence of hospital: ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకం ఓ బాలిక ప్రాణాలు తీసింది. వైద్యం పేరుతో ఐదేళ్ల బాలిక మృతికి కారణం అయింది. రాజేంద్రనగర్ కాటేదాన్ లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 29న అనారోగ్యంతో బాధపడుతున్న సాన్విక అనే ఐదేళ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక సైనస్ తో బాధపడుతుందని వెంటనే ఆస్పత్రి చేయాలని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. తమ కూతురును ఎలాగైనా బతికించాలని ఆ కుటుంబం వైద్యులను వేడుకుంది. అయితే రెండు రోజులు ఐసీయూలో చికిత్స అందించారు. ఆ తరువాత బాలిక మరణించింది.
Read Also: Rishabh Pant: రిషబ్ పంత్ను రక్షించిన డ్రైవర్, కండక్టర్లకు సత్కారం..
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
బాలిక పరిస్థితి విషమించడంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం నగరంలోని వేరే ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. ఇదంతా తల్లిదండ్రులకు చెప్పకుండా ఆస్పత్రి జాగ్రత్త పడింది. అయితే వేరే ఆస్పత్రికి తరలించే సమయానికే సాన్విక మరణించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలిక మృతదేహాన్ని కూడా అక్కడే వదిలేసి వచ్చింది సదరు ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం. విషయం తెలియడంతో సాన్విక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించారు. అప్పటి వరకు ఆడుకుంటున్న తమ బిడ్డను ప్రైవేటు ఆస్పత్రి బలితీసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ బిడ్డ మరణానికి కారణం అయిన వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మైలార్ దేవిపల్లి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!