Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Gap Between Ts Govt And Governor Tamilisai

Governor Vs Govt: గవర్నర్‌ కి ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌?

Published Date :April 8, 2022 , 8:19 am
By NTV WebDesk
Governor Vs Govt: గవర్నర్‌ కి ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మనదేశంలో గవర్నర్ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎప్పటినుంచో వుంటోంది. రాజ్యాంగ బద్ధమయిన పదవిని రాజకీయాలకు వాడుకుంటున్నారని, ప్రభుత్వాలను సరిగా పనిచేయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఏనాటినుంచో వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతోందంటున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మళ్ళీ ఈ అంశం తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాకి. మహిళ అనే చిన్నచూపుతో అవమానాలకు గురిచేస్తున్నారంటూ గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేయడం యావత్ దేశమంతా హాట్ టాపిక్ అవుతోంది. తాను ముఖ్యమంత్రిని అన్నగా భావిస్తానని, కానీ ప్రభుత్వంలోని కొందరు తనను కనీసం మహిళగానైనా గౌరవించడం లేదని, గవర్నర్‌ వ్యవస్థకైనా గౌరవం ఇవ్వడం లేదన్నారు.

Also Read

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!

తాను పాల్గొనే కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనడం లేదన్నారు. కనీసం ప్రొటోకాల్ పాటించకుండా అవమానాలకు గురిచేశారని.. చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయడంలేదన్నారు. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తానని, తనకు రాజకీయాలు అవసరం లేదన్నారు. రాజ్ ‌భవన్‌లో ఇటీవల తల్లి మరణిస్తే ప్రధాని సైతం తనను పరామర్శించారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం చూసేందుకు కూడా రాలేదన్నారు. కనీసం ఫోన్ చేసి కూడా పలకరించలేదని.. స్పెషల్ ఫ్లైట్ అడిగితే కూడా ఇవ్వలేదన్నారు. తన తల్లి చనిపోతే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం ఫోన్ కూడా ఎత్తలేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

https://ntvtelugu.com/governor-tamilisai-speaks-to-media-after-meet-with-amith-shah/

దూరప్రయాణాలలో గవర్నర్ రోడ్డు మార్గంలో ప్రయాణించడం అరుదు. అయితే, సమ్మక్క సారక్క జాతరకు కూడా ఐదు గంటలు ప్రయాణం చేసి రోడ్డు మార్గంలో వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణ వ్యవహారాలపై ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారన్నారు. కరుణానిధి , జయలలిత, మమతా బెనర్జీ వంటి వారు గవర్నర్లతో విభేదించినా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచేవారని ఆమె అన్నారు. అంతేకాకుండా యాదగిరిగుట్ట పర్యటనలోనూ గవర్నర్ కి చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ నేతలు కూడా ఉగాది వేడుకలకు పిలిస్తే వెళ్లలేదు. అదేంటని మీడియా ప్రశ్నిస్తే వెళ్ళడం, వెళ్ళకపోవడం తమ ఇష్టమన్నారు. తమిళిసై ప్రోటోకాల్ రగడ విషయంలో కేంద్రం సీరియస్ గా వుందని తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్‌ సోమేష్ కుమార్ ని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా? కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Delhi Tour
  • gap between ts govt and governor
  • Protocol Controversy
  • Tamilisai Soundararajan

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions