Illegal Sale Ganja: గంజాయి విక్రయిస్తున్న కిలాడీ లేడీ.. టార్గెట్ సాప్ట్వేర్ ఇంజినీర్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Sale Ganja: ఈమె పేరు నీతు.. అమ్మాయి కాదు గంజాయి విక్రయంలో ఆరితేరిన డాన్ లేడీ. సాప్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్ గా గంజాయి విక్రమాలు నిర్వహిస్తు లక్షలు సంపాదించుకునేందుకు ప్లాన్ వేసింది. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలైంది. నీతు వ్యవహారం చూసి పోలీసులకే షాక్ తిన్నారు. అయితే.. గంజాయి స్మగ్లింగ్పై సైబరాబాద్ ఎస్వోటీ టీమ్ ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ నగరశివారులోని నానక్రామ్ గూడలో ఎస్ఓటీ దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో గంజాయి లేడీ డాన్ను ఎస్వోటీ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లేడీ డాన్ నీతుగా గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్ గా నీతు గంజాయి విక్రయిస్తోందని వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ తిన్నారు. ఒక్కరోజుకు సుమారు లక్షల రూపాయల విలువైన గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. గంజాయి విక్రయాలతో కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందని భావించింది నీతు.
Read also: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ “ఇస్లామిక్ స్టేట్” పనే..!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
పక్కా సమాచారంతో నానక్ రామ్ గూడలోని నీతు ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహించగా.. భారీగా గంజాయి, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద మొత్తం 20 కిలోల గంజాయి, 20 లక్షల రూపాయల నగదు లభించినట్లు తెలుస్తోంది. గంజాయి స్మగ్లింగ్పై సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా పలు ప్రాంతాల్లో సోదాలు పూర్తి చేసి పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం 4.4 కిలోల గంజాయి, ఎల్ఎస్డీ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఎల్ఎస్డీ, అత్తాపూర్లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్లో భారీగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయి, గంజాయి చాక్లెట్లు, నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలో 1500 గంజాయి చాక్లెట్లు, పటాన్చెరులో 1960 చాక్లెట్లు, నిజాంపేటలో 114 ఈ-సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Machani Somnath: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాచాని సోమనాథ్..
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!