Gangula Kamalakar: నిర్లక్ష్యంగా ఉంటే.. ఉపేక్షించేదే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangula Kamalakar Suggestions To Officials On CMR: సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పౌరసరఫరాల శాఖలోని ఉన్నతాధికారులు, జిల్లాల డీఎస్వో, డీఎంలతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సీఎంఆర్, రాబోయే వానాకాలం పంట సేకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎఫ్సిఐ, సీఎంఆర్ సేకరణ పునరుద్దరించిన తర్వాత జరుగుతున్న మిల్లింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తి చేసిన మంత్రి.. ఖచ్చితమైన నిభందనలు పాటిస్తూ, గడువులోగా మిల్లింగ్ కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మిల్లింగ్లో జాప్యానికి అధికారులదే బాధ్యత అన్న మంత్రి.. త్వరలోనే జిల్లాల్లో తానే స్వయంగా పర్యటిస్తానన్నారు. సీఎంఆర్లో నిర్లక్ష్యం వహిస్తే.. ఎవరినైనా ఉపేంక్షించేది లేదని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎఫ్సీఐ వైఖరితో పాటు, మిల్లర్లకు సంబంధించిన అంశాలపై సుధీర్ఘ కసరత్తు చేసిన మంత్రి గంగుల కమలాకర్.. జిల్లాల్లో మొన్నటి వానలకు తడిసిన ధాన్యం ఎంత ఉందనే వివరాలతో పాటు, ఈ వానాకాలం సేకరించాల్సిన ధాన్యం పరిమాణంపై వారంలోగా నివేదికలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. అవసరమైతే.. దానిపై మరోసారి సమావేశం నిర్వహిద్దామని పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉన్న నేపథ్యంలో.. వచ్చే వానాకాలం ధాన్యం నిలువ ఉంచడానికి గల ఇంటర్మీడియట్ స్టోరేజీలను గుర్తించాలన్నారు. జిల్లా యంత్రాంగం క్రమం తప్పకుండా మిల్లులను తనిఖీ చేయడంతో పాటు మిల్లింగ్ ప్రక్రియ, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే టాస్క్ ఫోర్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు.
Also Read
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
ఎట్టిపరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యం రీసేల్, రీసైక్లింగ్ జరగకుండా.. చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సంక్షేమ గురుకులాలకు, హాస్టళ్లకు, విద్యాలయాలకు సరైన నాణ్యతతో కూడిన బియ్యం మాత్రమే అందించాలన్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సక్రమంగా పనిచేసే అధికారులను ప్రశంసిస్తామని.. విదినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నవారిని మాత్రం ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!