Gangula Kamalakar : కేంద్రం తీరు దున్నపోతులాగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కామెంట్స్ మాట్లాడుతూ.. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందని ఆయన మండిపడ్డారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామన్నారు. తెలంగాణలో ప్రజలు భారతీయులు కాదా? తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం కాదా? మేమేమన్నా విదేశీయులమా? అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనాలని అడగడం మా హక్కు. మీ మెడలు వంచైనా ధాన్యం కొనెలా ఒత్తిడి తెస్తామని, అధికార పార్టీలో ఉన్న తమను ధర్నా చేసే స్థాయికి తీసుకువచ్చింది కేంద్రమన్నారు. కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసనగా తామంతా రోడ్లపైకి వచ్చామని, ధాన్యం కొనాలని అడిగేందుకు ఢిల్లీకి వెళ్తే ఘోరంగా అవమానించారన్నారు.
ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు, ఏ రాష్ట్రంలో ఏ పంట పండినా వారి అవసరాలకు పోను మిగిలిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రాజ్యాంగంలో చేర్చారన్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల తెలంగాణలో పండే వరి గింజలు పగిలి పోయి నూకలుగా మారుతాయని, ధాన్యం బాయిల్డ్ చేసి మరపట్టిస్తే నూకలు కావన్న విషయం కేంద్రమే చెప్పిందని, మనకు బాయిల్డ్ రైస్ చేసే విధానం నేర్పించి, పారాబాయిల్డ్ మిల్లులు పెట్టుకునేలా ప్రోత్సహించిందన్నారు. ఇంతకాలం సేకరించిన కేంద్రం ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొననంటోందని, కేంద్రం మెడలు వంచేదాకా మా పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!