Seshanna Arrested: నయీమ్ అనుచరుడు శేషన్నను అరెస్టు
Seshanna Arrested: సుదీర్ఘకాలంగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మాజీ నక్సటైట్, గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడు మద్దనూరి శేషయ్య అలియాస్ శేషన్న ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్జోన్ డీసీపీ జోయోల్ శేషన్న అరెస్టును అధికారికంగా ప్రకటించారు. శేషన్న బెదిరింపులు, హత్యలకు పాల్పడ్డాడని, అతనిపై ఇప్పటి వరకు 9 కేసులను గుర్తించామన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయాడని, కొన్నాళ్ల నుంచి ల్యాండ్ సెటిల్మెంట్లు అక్రమ దందాలను చేస్తున్నట్లు తెలియడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు హుమయూన్నగర్లో ఆయుధాల కేసులో అరెస్టు చేశామని ప్రకటించారు. శేషన్న పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని గోల్కొండ పోలీసులు తెలిపారు. శేషన్న నానక్ రాంగూడ నుండి గచ్చిబౌలి వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. శేషన్నపై వివిధ పోలీస్ స్టేషన్ లలో 9 కేసులు వున్నట్లు తెలిపారు.
Read also: PFI: పీఎఫ్ఐపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల పాటు నిషేధం
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
1993లో శేషన్నను మొదటిసారి ఆరేస్ట్ చేసిన సనత్ నగర్ పోలీసులు. శేషన్న ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులను నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్ స్టార్ నయీంతో కలిసి అనేక నేరాలకు పాల్పడటమే కాకుండా.. నయీంతో కలిసి మావోయిస్ట్ అవతారం, 15 మంది నక్సల్ కమాండర్స్ తో శేషన్న పని చేశాడు. దళం కమాండర్ సుదర్శన్ రెడ్డి తోపాటు నాగన్న, మాధవన్న, మల్లన్న లతో పని చేశాడు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులతో శేషన్నకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మావోయిస్టులకు కొరియర్ గా, డెన్ కీపర్ గా పని చేశాడు. శేషన్న పై పలు కిడ్నాప్, మర్డర్, ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు వున్నాయని తెలిపారు. శేషన్న పై 6 మర్డర్ కేసులు,3 ఆర్మ్స్ యాక్ట్ కేసులు వున్నాయని, 9 ఎంఎం పిస్టల్, 5 తూటాలు లభించినట్లు వెల్లడించారు పోలీసులు. హైదరాబాద్ బీఎన్రెడ్డి నగర్లోని చైతన్యనగర్ కాలనీలో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.
2016 ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్లో హతం అయ్యాడు నయీమ్. ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. నయీమ్ బినామీ ఆస్తులను జప్తు చేయాలని ఐటీశాఖ నిర్ణయించింది. ఆస్తులను సీజ్ చేసింది ఐటీ శాఖ మొత్తం 45 ఆస్తులు ఉన్నట్టు గతంలోనే ఐటీ శాఖ గుర్తించగా అందులో పది ఆస్తులను ఇప్పుడు సీజ్ చేశారు. ఈ పది ఆస్తులు విలువ సుమారు 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఆస్తులు సీజ్ విషయంపై నయీమ్ భార్యకు నోటీసులు ఇచ్చారు ఐటీ శాఖ అధికారులు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
తాజావార్తలు
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!