Gandipet Gates Open: గండిపేట గేట్లు ఎత్తివేత.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మూసీ నదిలో వరద ఉధృతి పెరిగింది.. శంకర్పల్లి సహా మిగత ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది.. భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో 6 ఫీట్ల మేరా 12 గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.. నార్సింగి నుండి అప్పా వెళ్లే దారిని పూర్తిగా మూసి వేశారు పోలీసులు.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. గండిపేట మండలంలోని పలు గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి… ఇక, 2010 సంవత్సరంలో 12 గేట్లు ద్వారా నీటిని విడుదల చేశారు.. అధికారులు.. అంటే.. మళ్లీ 12 గేట్లను.. అది జులై నెలలోనే ఎత్తివేయడం 12 ఏళ్ల తర్వాత ఇది తొలిసారి..
Read Also: Clashes at temple festival: మధురైలో ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ.. కర్రలు, రాళ్లతో దాడి..
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
మరోవైపు ముసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.. నగరంలోని మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిని ఆనుకుని మూసీ నది ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పురాతన బ్రిడ్జి కావడం.. ఆ బ్రిడ్జి పై నుంచి మూసీ నది ప్రవహించే అవకాశం ఉండడంతో.. రాకపోకలు నిలిపివేశారు. ఇవాళ రాత్రికి బ్రిడ్జిపైకి వరదనీరు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇదే సమయంలో.. మూసీ నది వరద ఉద్ధృతి పెరిగితే.. చాదర్ఘాట్లో లెవెల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిపివేస్తామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.. ఇక, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే.. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు సంప్రదించాలని అధికారులు సూచించారు. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
తాజావార్తలు
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..