Gaddar Daughter: కాంగ్రెస్ అవకాశమిస్తే పోటీకి సిద్దం.. తెలంగాణ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddar Daughter: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే.. అధికార బీఆర్ఎస్ మినహా.. మిగతా పార్టీలు ఏవీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె వెన్నెల కూడా ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ వార్తలపై వెన్నెల స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెన్నెల చెప్పారు. తాను కంటోన్మెంట్ లోనే పుట్టి పెరిగానని చెప్పిన వెన్నెల.. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఈసారి పోటీ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు అందుకే క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందని వెన్నెల తెలిపారు. గద్దర్ కూతురిగా ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆమె తెలిపారు. ఓటు విప్లవం రావాలని గద్దర్ ఆకాంక్షించారని.. అందుకే చివరకు కాంగ్రెస్ కు మద్దతిచ్చారని వివరించారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ భావించారని వెన్నెల తెలిపారు. తండ్రి కోరిక తీర్చేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమని వెన్నెల ప్రకటించారు. తన కూతురి గెలుపునకు తనవంతు కృషి చేస్తానని గద్దర్ భార్య విమల అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తమ కూతురికి టిక్కెట్టు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఊరుకోవడం లేదు. తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని.. కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గద్దర్ తన చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ జోద్ యాత్రలో రాహుల్ గాంధీని కూడా గద్దర్ కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలతో పటు పులువురు సత్సంబంధాలు కొనసాగించారు. అయితే.. గద్దర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన కుటుంబాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓదార్చారు. గద్దర్ అంత్యక్రియల్లో కాంగ్రెస్ అగ్రనేతలంతా కనిపించారు. ఈ నేపథ్యంలో గద్దర్ కుమార్తెకు అవకాశం ఇస్తే సానుభూతి వర్కవుట్ అవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఆయన కుమార్తె లాస్య నందితకు అధికార పార్టీ బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఆమెను ఆశీర్వదించి ధైర్యం చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆమె తండ్రి మద్దతు.. ఆయన అకాల మరణం పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉండడంతో.. లాస్య నందిత గెలుస్తుందన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది. మరి సానుభూతి ప్రాతిపదికన రెండు పార్టీలు వారసులను బరిలోకి దింపుతున్నాయో చూడాలి.. ఎవరికి దీవెన వస్తుందో?
Dussehra Offers సూర్యపేటలో రూ.10 పట్టుచీర.. ఎగబడిన మహిళలు
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
తాజావార్తలు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!