Gaddar Daughter: కాంగ్రెస్ అవకాశమిస్తే పోటీకి సిద్దం.. తెలంగాణ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddar Daughter: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే.. అధికార బీఆర్ఎస్ మినహా.. మిగతా పార్టీలు ఏవీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె వెన్నెల కూడా ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ వార్తలపై వెన్నెల స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెన్నెల చెప్పారు. తాను కంటోన్మెంట్ లోనే పుట్టి పెరిగానని చెప్పిన వెన్నెల.. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఈసారి పోటీ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు అందుకే క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందని వెన్నెల తెలిపారు. గద్దర్ కూతురిగా ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆమె తెలిపారు. ఓటు విప్లవం రావాలని గద్దర్ ఆకాంక్షించారని.. అందుకే చివరకు కాంగ్రెస్ కు మద్దతిచ్చారని వివరించారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ భావించారని వెన్నెల తెలిపారు. తండ్రి కోరిక తీర్చేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమని వెన్నెల ప్రకటించారు. తన కూతురి గెలుపునకు తనవంతు కృషి చేస్తానని గద్దర్ భార్య విమల అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తమ కూతురికి టిక్కెట్టు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఊరుకోవడం లేదు. తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని.. కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గద్దర్ తన చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ జోద్ యాత్రలో రాహుల్ గాంధీని కూడా గద్దర్ కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలతో పటు పులువురు సత్సంబంధాలు కొనసాగించారు. అయితే.. గద్దర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన కుటుంబాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓదార్చారు. గద్దర్ అంత్యక్రియల్లో కాంగ్రెస్ అగ్రనేతలంతా కనిపించారు. ఈ నేపథ్యంలో గద్దర్ కుమార్తెకు అవకాశం ఇస్తే సానుభూతి వర్కవుట్ అవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఆయన కుమార్తె లాస్య నందితకు అధికార పార్టీ బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఆమెను ఆశీర్వదించి ధైర్యం చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆమె తండ్రి మద్దతు.. ఆయన అకాల మరణం పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉండడంతో.. లాస్య నందిత గెలుస్తుందన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది. మరి సానుభూతి ప్రాతిపదికన రెండు పార్టీలు వారసులను బరిలోకి దింపుతున్నాయో చూడాలి.. ఎవరికి దీవెన వస్తుందో?
Dussehra Offers సూర్యపేటలో రూ.10 పట్టుచీర.. ఎగబడిన మహిళలు
Also Read
తాజావార్తలు
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!