Gaddar Daughter: కాంగ్రెస్ అవకాశమిస్తే పోటీకి సిద్దం.. తెలంగాణ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddar Daughter: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే.. అధికార బీఆర్ఎస్ మినహా.. మిగతా పార్టీలు ఏవీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె వెన్నెల కూడా ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ వార్తలపై వెన్నెల స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెన్నెల చెప్పారు. తాను కంటోన్మెంట్ లోనే పుట్టి పెరిగానని చెప్పిన వెన్నెల.. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఈసారి పోటీ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు అందుకే క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందని వెన్నెల తెలిపారు. గద్దర్ కూతురిగా ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆమె తెలిపారు. ఓటు విప్లవం రావాలని గద్దర్ ఆకాంక్షించారని.. అందుకే చివరకు కాంగ్రెస్ కు మద్దతిచ్చారని వివరించారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ భావించారని వెన్నెల తెలిపారు. తండ్రి కోరిక తీర్చేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమని వెన్నెల ప్రకటించారు. తన కూతురి గెలుపునకు తనవంతు కృషి చేస్తానని గద్దర్ భార్య విమల అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తమ కూతురికి టిక్కెట్టు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఊరుకోవడం లేదు. తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని.. కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గద్దర్ తన చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ జోద్ యాత్రలో రాహుల్ గాంధీని కూడా గద్దర్ కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలతో పటు పులువురు సత్సంబంధాలు కొనసాగించారు. అయితే.. గద్దర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన కుటుంబాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓదార్చారు. గద్దర్ అంత్యక్రియల్లో కాంగ్రెస్ అగ్రనేతలంతా కనిపించారు. ఈ నేపథ్యంలో గద్దర్ కుమార్తెకు అవకాశం ఇస్తే సానుభూతి వర్కవుట్ అవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఆయన కుమార్తె లాస్య నందితకు అధికార పార్టీ బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఆమెను ఆశీర్వదించి ధైర్యం చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆమె తండ్రి మద్దతు.. ఆయన అకాల మరణం పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉండడంతో.. లాస్య నందిత గెలుస్తుందన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది. మరి సానుభూతి ప్రాతిపదికన రెండు పార్టీలు వారసులను బరిలోకి దింపుతున్నాయో చూడాలి.. ఎవరికి దీవెన వస్తుందో?
Dussehra Offers సూర్యపేటలో రూ.10 పట్టుచీర.. ఎగబడిన మహిళలు
Also Read
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
తాజావార్తలు
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?