Fraud in Market: పాలమూరులో వ్యాపారుల మాయాజాలం.. తూకాల్లో గోల్ మాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud in mutton, chicken, fish weight: తూకాలలో మోసాలు.. అడ్డూ అదుపు లేకుండా కల్తీ వ్యాపారాలు. తూకంలో జరిగినన్ని మోసాలు మరెందులోనూ జరగవంటే అతిశయోక్తి కాదు. పాల నుంచి పప్పు వరకు, కిరోసిన్ నుంచి కూరగాయల వరకు అన్నీ తప్పుడు తూకాలే. అంతేకాదు చిల్లర కొట్టు బండి నుంచి బడా మాల్స్ వరకు ఇదే పరిస్థితి. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో చేతివాటం.. బంగారం తూచే మిషన్లు ఇలా అన్నింట్లోనూ మోసాలే. అయితే.. కొంతమంది వ్యాపారులు ఏండ్ల తరబడి ఒకే తూకంరాళ్లను వినియోగిస్తున్నారు. కాగా.. కిలో తూకంరాయి ని చూస్తే దానిపై ముద్రించిన అక్షరాలు సైతం అరిగి పోయి ఉంటున్నాయి. దీంతో.. వినియోగదారుల అవగాహనలేమి వల్ల మార్కెట్లో ప్రతి వస్తువు ధరను వ్యాపారులు నిర్ణయిస్తున్నారు.. ఈనేపథ్యంలో.. వ్యాపారులు తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతూ.. యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులతో మార్కెట్లన్నీ నిండుగా మారుతాయి. ఆరోజు మటన్, చికెన్, ఫిష్ లేనిదే ముద్దదిగదు. అంతే అది ఫిక్స్ అయిపోయారు మన నాన్వెజ్ ప్రియులు. అయితే ఇదే అలుసుగా తీసుకుని మార్కెట్ లో మోసాలకు పల్పాడుతున్నారు.
మటన్, ఫిష్ ఇతర దుకాణాల వద్ద తూకాలలో మోసాలకు పాల్పడుతున్నారు. ఈఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డ్ లో జరుగుతున్నాయని సంబంధిత జిల్లా అధికారులకు ఫిర్యాదు అందడంతో జిల్లా అధికారి రామ్మోహన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మటన్, ఫిష్ అమ్మకాలు చేస్తున్న వారి తూకానికి సంబంధించిన బాట్లను పరిశీలించి అవాక్కయ్యారు. ఒక కేజీ బాటుకు 750 గ్రాములు మాత్రమే ఉంచి వినియోగదారులను మోసం చేస్తున్నారని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మటన్, ఫిష్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై జరిమానాలు విధించామని జిల్లా అధికారి తెలిపారు. వినియోగదారులను మోసాలు చేస్తే చూస్తూ ఊరుకోమని కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు..మటన్ వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగించే విధంగా తునికల కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మోసాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే అలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలకు సూచించారు.
Online Fraud: లాటరీ వచ్చిందని.. 6లక్షలు దోచేసిన కేటుగాళ్లు
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఇదే..!
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!