Karimnagar: అంతుచిక్కని వ్యాధితో కుటుంబం బలి.. గంగాధరలో మిస్టరీ డెత్స్
Four people died due to an elusive disease in Karimnagar district: కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం మరణం మిస్టరీగా మారింది. అంతుచిక్కని వ్యాధితో కుటుంబంలోని సభ్యులు వరసగా మృతిచెందారు. నెల రోజు వ్యవధిలోనే ఈ మరణాలు సంభవించాయి. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన ఓ కుటుంబంలో అంతుచిక్కని వ్యాధి పెను విషాదాన్ని నింపింది. 40 రోజుల్లో శ్రీకాంత్, భార్య మమతతో పాటు కూతురు అమూల్య(6), అద్వైత్(20 నెలలు) ఒకరి తరువాత ఒకరు మరణించారు.
వీరంతా వాంతులు చేసుకుంటూ చనిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే వ్యాధి ఏంటనేది ఇప్పటికీ తెలియడం లేదు. ఈ మాయదారి రోగం వైద్యులకు కూడా అంతుబట్టడం లేదు. మరణించిన కుటుంబ సభ్యుల రక్తనమూనాలను హైదరాబాద్ లోని ల్యాబుకు పంపించారు. గంగాధర పోలీసులు ఈ మిస్టరీ డెత్స్ పై విచారణ కొనసాగిస్తున్నారు. ముందుగా శ్రీకాంత్ భార్య, పిల్లలు వరసగా మరణించారు. ఆ తరువాత శ్రీకాంత్ కూడా ఇటీవల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించే ముందు శ్రీకాంత్ వాంతులు చేసుకుంటూ ప్రాణాలు వదిలారు. అంతకుముందు భార్య, పిల్లలు కూడా ఇదే తరహాలో మరణించడం గ్రామంలో విషాదాన్ని నింపింది. అయితే ఏ వ్యాధితో మరణించారో తెలియక గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
Read Also: Tamil Nadu: తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి
నెత్తురోడిన రోడ్డు:
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడి పేట ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న తండ్రి కొడుకులను వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కొడుకు శివచరణ్ మరణించగా.. తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తమిళనాడు చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మహిళాభక్తులకు గాయాలయ్యాయి. వీరంతా మేల్మరువత్తూర్ ఆలయ సందర్శన కోసం సేలం వెళ్తుండగా ఘటన జరిగింది.
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో