B. Vinod Kumar : అమిత్ షా కు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former MP Vinod Kumar Letter To Union Minister Amit Shah.
తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాత అంటే.. 1931 సంవత్సరం తరువాతే అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ లేఖ రాశారు. ఆ లేఖలో.. రాజ్యసభలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మంగళవారం నాడు అడిగిన ప్రశ్నకు సమాధానం గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది కాబట్టి అది కుదరదని, 2026 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత మాత్రమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తామని, అంతకన్నా ముందు ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుదల అవకాశం లేదని స్పష్టం చేసిన చేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. అయితే జనాభా లెక్కల సవరణ అంశం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని, ఈ లెక్కన 1931 సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రాతిపాదికన మాత్రమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉంటుందన్న విషయం స్పష్టమైందని, 2026 సంవత్సరం తర్వాత అనే పదంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాటల్లో తేలిపోయిందని వినోద్ కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ఒకే దేశం, ఒకే చట్టం అని బిజెపి నినాదాలు ఇస్తోందని, కానీ వాస్తవ రూపంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని, దానికి తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచకపోవడమే నిదర్శనమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ని సవరించకుండానే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం అసెంబ్లీ సీట్లను పెంచిందని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర హోం శాఖ మంత్రి కి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ఒక న్యాయం తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు మరో న్యాయమా అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 నీ సవరించడం ద్వారా గాని, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారాల మేరకు అయినా గాని తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల స్థానాలను పెంచాలని కోరిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!