కేసీఆర్పై మాజీ ఎంపీ ఫైర్.. డేంజరస్ ఫెలో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ రవీందర్ నాయక్.. దళిత బంధు పథకాన్ని స్వాగతించిన ఆయన.. వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లు ఉంది కేసీఆర్ వైఖరి అంటూ ఎద్దేవా చేశారు. దళిత గిరిజనులను… తెలంగాణ పేదలను మోసం చేసి హుజురాబాద్ లో గెలిచేందుకు ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ఓ చీటర్.. ఏడేళ్లుగా అందరినీ మోసం చేస్తున్నారని విమర్శించారు.. తెలంగాణ మేధావులు. రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలని సూచించిన ఆయన.. ఇక, హుజురాబాద్ లో దళిత బంధు తీసుకోవాలి.. ఆ తరువాత ఆయనకు బుద్ధి చెప్పాలి.. అప్పుడే రాష్ట్రంలో మిగిలిన దళితులకు.. గిరిజనులు.. పేదలకు న్యాయం చేస్తారని సూచించారు.
ఏడున్నర ఏళ్లుగా దళిత.. గిరిజనులకు కేటాయించిన డబ్బులే ఇప్పుడు ఇస్తున్నారని విమర్శించారు రవీంద్రనాయక్.. 20 లక్షల కోట్ల బడ్జెట్ లో 60వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఉంటాడు అని కామెంట్ చేసిన ఆయన.. కేసీఆర్ సీఎం అయ్యాక పేదలకు చేసిందేమీ లేదు.. కానీ, తన కుటుంబానికి మాత్రం ఫాం హౌజ్ లు.. భూములు కొన్నారు.. పదవులు ఇచ్చుకున్నారని.. అధికారం నిలబెట్టుకునేందుకు మాత్రమే కేసీఆర్ పని చేస్తారని ఎద్దేవా చేశారు. తనకొడుకును ముఖ్యమంత్రి చేయడం.. చివరకు మనువన్ని కూడా కేసీఆర్ గెలిపించుకుంటారని కామెంట్ చేసిన ఆయన.. ధనదాహం తీర్చుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టారని మండిపడ్డారు.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దారి మళ్లించారని ఆరోపించిన బీజేపీ నేత.. తాండాలను పంచాయతీలు చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టారని.. అక్కడ బడ్జెట్ లేదు.. నిధులు ఇవ్వలేదు.. ఇక, జిల్లా పరిషత్ నిధులు35 వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయలేదరని విమర్శించారు. ఏదీ చేయకుండా.. ఏదో చేసినట్లు నటిస్తాడు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రవీంద్రనాయక్.. పోడు భూముల రైతులను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ ను తన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
హుజూర్నగర్లో 40రోజుల పాటు గిరిజనుల ను జైలులో పెట్టించారని మండిపడ్డారు రవీంద్ర నాయక్.. ఎస్టీ కమిషన్ ను ఎందుకు సపరేట్ చేయలేదు? అని ప్రశ్నించిన ఆయన.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎందుకు చేయడం లేదు? అని నిలదీశారు.. 10 శాతం రిజర్వేషన్లు ఇస్తా అని తూతూమంత్రంగా బిల్లు పాస్ చేసారు.. దానికి రాజ్యాంగ సవరణ అవసరం అన్నారు. చేతివృత్తుల ఏ కార్పొరేషన్ లో నిధులు లేవు.. నిర్వీర్యం చేసారు.. ఉప ఎన్నికలు వస్తే గొర్రెలు, బర్రెల పంపిణీ అంటూ ప్రకటిస్తున్నారు.. కాపలా కుక్క లా ఉంటా అన్నాడు.. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేసి ఉంటే హుజురాబాద్ లో ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నావు కేసీఆర్? అసలు కేసీఆర్ కు ఈటల రాజేందర్ను చూసి భయం పుట్టుకొచ్చిందని కామెంట్ చేశారు. ఈబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.. కానీ, రాష్ట్రంలో అమలు చేయడం లేదన్న ఆయన.. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిస్తున్నాడు అంటూ కేసీఆర్పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ డేంజరస్ ఫెలో.. ఆయనను రాజకీయంగా కొట్టి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!