Ponnam Prabhakar: ఒక్క కేసీఆర్ కే ఈడీ నోటీసులు ఇంకా రాలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ హయాంలో ఈడీ నోటిసులు కామన్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఇప్పటి వరకు ఈడీ నోటీసులు రాలేదని అన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే బీజేపీ ఈడీ నోటీసులు ఇవ్వడం లేని ఆయన అన్నారు. ఇక్కడే బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీ అర్థం అవుతుందని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అయిందని.. ఇన్నాళ్లు రాష్ట్రాన్ని పట్టించుకోని బీజేపీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో పొన్నం విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వక్రీకరించిన మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పొన్నం విమర్శించారు. తల్లిని చంపి, బిడ్డను బతికించారని చెప్పిన మోదీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఆవిర్భావాని కన్నా ముందే 8 మండలాలను ఆంధ్రలో కలిపింది బీజేపీ పార్టీ అని అన్నారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
మతాలను రెచ్చగొట్టి చిన్నాభిన్నం చేస్తోందని.. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల పేరుతో చరిత్ర వక్రీకరణ చేస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం పేరు లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో లేని వాళ్లు చరిత్రను మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. 105 సీట్లలో డిపాజిట్ లేని వాళ్లతో మాకు పోటీ ఎక్కడ అని.. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ తోనే పోటీ అని అన్నారు పొన్నం. మసీదు కూల్చాలని బండి సంజయ్ మాటలు సరికాదని.. ఆయన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఈడీ సమన్లపై మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి కూడా స్పందించారు. రాహుల్, సోనియా గాంధీకలు ఈడీ నోటీసులు ఇవ్వడంలో ఆశ్యర్యం లేదని ఆమె అన్ారు. ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని.. కేసులు పెట్టి వేధించాలని బీజేపీ అనుకుంటుందని విమర్శించారు. గాంధీ కుటుంబంలో భయపడేది అనేది ఉండదని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?