Ponnam Prabhakar: ఒక్క కేసీఆర్ కే ఈడీ నోటీసులు ఇంకా రాలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ హయాంలో ఈడీ నోటిసులు కామన్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఇప్పటి వరకు ఈడీ నోటీసులు రాలేదని అన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే బీజేపీ ఈడీ నోటీసులు ఇవ్వడం లేని ఆయన అన్నారు. ఇక్కడే బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీ అర్థం అవుతుందని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అయిందని.. ఇన్నాళ్లు రాష్ట్రాన్ని పట్టించుకోని బీజేపీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో పొన్నం విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వక్రీకరించిన మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పొన్నం విమర్శించారు. తల్లిని చంపి, బిడ్డను బతికించారని చెప్పిన మోదీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఆవిర్భావాని కన్నా ముందే 8 మండలాలను ఆంధ్రలో కలిపింది బీజేపీ పార్టీ అని అన్నారు.
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
మతాలను రెచ్చగొట్టి చిన్నాభిన్నం చేస్తోందని.. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల పేరుతో చరిత్ర వక్రీకరణ చేస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం పేరు లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో లేని వాళ్లు చరిత్రను మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. 105 సీట్లలో డిపాజిట్ లేని వాళ్లతో మాకు పోటీ ఎక్కడ అని.. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ తోనే పోటీ అని అన్నారు పొన్నం. మసీదు కూల్చాలని బండి సంజయ్ మాటలు సరికాదని.. ఆయన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఈడీ సమన్లపై మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి కూడా స్పందించారు. రాహుల్, సోనియా గాంధీకలు ఈడీ నోటీసులు ఇవ్వడంలో ఆశ్యర్యం లేదని ఆమె అన్ారు. ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని.. కేసులు పెట్టి వేధించాలని బీజేపీ అనుకుంటుందని విమర్శించారు. గాంధీ కుటుంబంలో భయపడేది అనేది ఉండదని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!