Operation Karre Gutta: కర్రెగుట్ట కూంబింగ్ లో బిగ్ ట్విస్ట్..
- కర్రెగుట్ట కూంబింగ్ లో బిగ్ ట్విస్ట్..
- భారీ సొరంగాన్ని గుర్తించిన భద్రతా బలగాలు..
- మావోయిస్టుల ఆచూకీ కోసం గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Karre Gutta: గత ఆరు రోజులుగా కర్రె గుట్టలలో భద్రతా బలగాలు కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.. ఈ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దు కర్రె గుట్టలలో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. ఈ సొరంగంలో ఒక ప్రాంతం నుంచి మరో మార్గం ద్వారా బయటికి వెళ్లేందుకు వీలుగా ఉందని భద్రతాదళాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సొరంగాన్ని స్థావరంగా చేసుకొని మావోయిస్టులు దాడులకు తెగబడ్డారని పేర్కొన్నాయి. అయితే, ఈ సొరంగంలో సరైన గాలి నీరు వాతావరణం ఉంది.. అంతే కాకుండా ఇక్కడ విశాలమైన ప్రాంతం కూడా ఉందన్నారు.ఈ సొరంగంలో 1000 మంది పట్టేంత స్థలం ఉందని అధికారులు వెల్లడించారు..
Read Also: Kaleshwaram ENC Hariram: ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం.. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు
Also Read
కాగా, కర్రెగుట్ట కొండల్లో నక్సలైట్లపై కొనసాగుతున్న ఆపరేషన్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. ఎండ వేడిమి, 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య శ్రమించి.. ఎట్టకేలకు వారి స్థావరానికి చేరుకోగలిగారు. అయితే భద్రతా దళాలు అక్కడికి చేరుకోకముందే మావోయిస్టులు తమ స్థావరాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇక్కడ వారు ఉన్నట్టు ఆనవాళ్లు దొరికాయి. ఈ గుహలో చాలా రోజుల పాటు వెయ్యి మందికి పైగా ఆశ్రయం పొందవచ్చని చెప్పుకొచ్చారు. ఈ సొరంగానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిత్రీకరించారు.
Read Also: Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. టెర్రరిస్టుల ఎలా వచ్చారంటే..?
ఇక, పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఈ కూంబిండ్ ప్రారంభమైనప్పటి నుంచి నక్సలైట్లు ఆహారం, మంచి నీటి కోసం వెంపర్లాడినట్లు తెలుస్తుంది. నక్సలైట్లు తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి సుమారు 4 నెలల పాటు రేషన్తో కర్రెగుట్ట కొండలలో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. భద్రతా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టడంతో.. ఆ రేషన్ కూడా వారికి ఉపయోగపడలేదు.. కొండలపై నుంచి దిగితే సైనికుల తూటాలకు బలి అవుతారనీ, భయంతో కొండలపైనే ఎక్కువ కాలం దాక్కుని ఉంటే డీహైడ్రేషన్ వల్ల చనిపోతామనే భయం వారిని వెంటాడుతుంది. మరోవైపు, నక్సలైట్లు దాక్కున్న కొండలను మొత్తం స్వాధీనం చేసుకునే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని భద్రతా దళాలు పట్టుదలతో ఉన్నాయి. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు చొరవ చూపాలంటూ ఇటీవల నక్సలైట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
Read Also: BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ రజతోత్సవ సభ లైవ్ అప్డేట్స్..
అయితే, మోస్ట్ వాంటేడ్ మావోయిస్టులు కోట్లాది రూపాయల రివార్డు ఉన్న వాళ్లందరు కర్రెగుట్టల్లో తలదాచుకుంటున్నారని భద్రతా దళాలు చెబుతున్నాయి. కాగా, 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టలను స్వాధీనం చేసుకునేందుకు భద్రత బలగాలు హెలికాప్టర్ ను ఉపయోగించి దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే 40 మంది మావోయిస్టు చనిపోయినట్లు సమాచారం వస్తున్నప్పటికీ దానిని ఇప్పటి వరకు భద్రతా బలగాలు అధికారికంగా ధృవీకరించలేదు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!