Adilabad and Nizamabad: తెలంగాణ కశ్మీరం.. జిల్లాలను కమ్మేసిన పొగమంచు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad and Nizamabad: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పొగమంచు కమ్మేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కశ్మీరాన్ని తలపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచే దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో రహదారిపై లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. చలికి వణుకుతూనే పనులకు వెళుతున్నారు. మూడు రోజుల నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో దుబ్బపటి కప్పుకున్న వణుకుడు మాత్రం ఆగడం లేదు. జిల్లాల్లో ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో కశ్మీరాన్ని తలపిస్తుంది. ఉదయం రహదారుల్లో నడవాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎదుటి వాహనాలు కూడా మంచులో కనిపించకపోవడంతో రహదారుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంంటున్నారు.
Read also: Prabhas: పాన్ ఇండియా హీరోకి అదిరిపోయే విలన్ కటౌట్…
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
జిల్లాలకు కమ్మేసిన పొగమంచు..
ఆదిలాబాద్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. రహదారి పై తీవ్రమైన మంచుతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టంగా మంచు ఆవరించినడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పొగమంచు కమ్మేసింది. రోడ్లపై దట్టంగా పొగ మంచు అలుముకుని ఉండటంతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ రోడ్డు, బై పాస్ రహదారి తో పాటు ప్రధాన రోడ్ల లో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాని పొగమంచు కమ్మేసింది. రోడ్లపై దట్టంగా పొగమంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనుచూపు మేరలో వాహనాలు కనిపించడం లేదు. దీంతో రహదారిపై ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారింది. కాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. హనుమకొండ,కాలేశ్వరం 353 జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. లక్ష్మారెడ్డి పల్లి,మొరంచపల్లి ప్రధాన రహదారి పూర్తిగా పొగ మంచు కమ్మేసింది. వాహనచోదకులు దగ్గరికి వచ్చే వరకు ఒక వాహనానికి మరో వాహనం కనబడకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులు వాపోతున్నారు.
Mahua Moitra: నేడు లోక్ సభ ముందుకు మహువా మొయిత్రా సస్పెన్షన్ నివేదిక..!
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!