Flyovers closed in Hyderabad: నెక్లెస్ రోడ్ క్లోజ్.. ఫ్లై ఓవర్లు బంద్.. పోలీసుల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flyovers closed in Hyderabad: హైదరాబాద్లో దాదాపు అన్ని ఫ్లై ఓవర్లు మూతపడనున్నాయి. గ్రీన్ల్యాండ్ ఫ్లైఓవర్, పిఎన్విఆర్ ఎక్స్ప్రెస్వే మరియు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మంగళవారం రాత్రి నుండి మూసివేయబడతాయి. ‘షబ్-ఏ-ఖాదర్’ జగ్నే కీ రాత్ సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే నెక్లెస్ రోడ్డు, పీవీఎన్ఆర్ రోడ్డులో వాహనదారులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ప్రజలు, వాహనదారులు ప్రకటన విడుదల చేశారు. ఏమైనా సమస్యలుంటే ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626కు సంప్రదించాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఆంక్షలను పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Read also: Health director srinivasrao: అంతా తాబీజ్ మహిమ.. అలా అనేసారేంటి..
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
‘షబ్-ఎ-ఖదర్’ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్నేళ్లుగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. కానీ చంద్రుని దర్శనం ప్రకారం, అమావాస్యను బట్టి ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో రంజాన్ పండుగను జరుపుకునే అవకాశం ఉంది.పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని ముస్లిం సోదరులు ఇస్లాంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఐపీఎల్ టోర్నీ..
మరోవైపు ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ముంబై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ హైవే నుంచి వచ్చే వాహనాలను చెంగిచర్ల, చర్లపల్లి, ఎన్జీసీ వైపు మళ్లిస్తారు. ఐపీఎల్ మ్యాచ్ని చూసేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చే అభిమానులతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగానే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మ్యాచ్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ను మళ్లిస్తారు. అలాగే స్టేడియానికి వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో, టీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అదనపు సర్వీసులు నడుస్తున్నాయి.
Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!