Health director srinivasrao: అంతా తాబీజ్ మహిమ.. అలా అనేసారేంటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health director srinivasrao: ప్రభుత్వ అధికారి ఏది మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అయితే ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మరిచిపోతున్నారా? ఏ మీటింగ్ లో పాల్గొన్నా ఆయన మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు మరోసారి చిక్కుల్లో పడేశాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆయన మరోసారి అలాంటి పనే చేశారు. తాయత్తు వల్లే తాను బతికి ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అధికారిక హోదాలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శ్రీనివాస్ రావు… ఆపై మైక్ అందుకున్నారు. చిన్నతనంలో తాయత్తు వల్లే తాను బతికి ఉన్నానని, ఈస్థాయికి వచ్చానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ… ఇఫ్తార్ విందులో చాలా సంతోషంగా కనిపించారు. కాగా ఆయన మూఢనమ్మకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ డైరెక్టర్ హోదాలో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా? అని హేతువాదులు మండిపడుతున్నారు. అంతేకాకుండా.. శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో పొలిటికల్ ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రజా సేవే నిజమైన రాజకీయం అని తెలిపారు. కేసీఆర్, కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెంలో పోటీ చేస్తానన్నారు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
శ్రీనివాస్ రావు గతంలో కూడా కరోనా విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. గతేడాది డిసెంబర్లో కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందని అన్నారు. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని… ఏసు ప్రభువు దయ వల్లనే కరోనా తగ్గుముఖం పట్టిందని అన్నారు. మన దేశానికి ఆధునిక వైద్యం, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు ఆయనపై మండిపడ్డారు. ఒక హెల్త్ డైరెక్టర్ అయివుండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అంతా తాబీజ్ మహిమ అంటూ మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయి.
Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!