Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Farmer: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో ఓ రైతు కరెంట్ స్తంభం ఎక్కి బీభత్సం సృష్టించాడు. భూవివాదం కారణంగా రైతు కరెంట్ స్తంభం ఎక్కి హైటెన్షన్ వైర్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి అతడిని కిందకు దించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సేవాలాల్ తండాలో చోటుచేసుకుంది.
కరెంట్ స్తంభం ఎందుకు ఎక్కాడంటే..
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
సేవాలాల్ తండాకు చెందిన దారంసోత్ రవి, దారంసోత్ బాలరాజు అన్నదమ్ములు. రవి తండ్రి హర్యానాయక్ పేరు మీద ఉన్న కొంత భూమిని బాలరాజు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. అయితే ఈ భూమి యాజమాన్య హక్కుల విషయంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పలుమార్లు పంచాయతీకి పిలిచినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో సోమవారం ఆ భూమిలో వేసిన వరి పంటను కోసేందుకు రవి ప్రయత్నించగా బాలరాజు అడ్డుకున్నాడు. పంచాయతీ తేల్చే వరకు వరికోత లేదన్నారు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేంత వరకు వెళ్లింది.
దీంతో తన భూమి తనకు దక్కటం లేదని బాలరాజు తీవ్ర మనస్థాపం చెందాడు. తాను బ్రతకడం ఎందుకని భావించి ఆవేశంతో కరెంట్ స్తంభం ఎక్కాడు. హైటెన్షన్ వైర్లు పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వద్దని చెప్పిన మాట వినకుండా స్తంభం ఎక్కాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ సబ్ స్టేషన్కు ఫోన్ చేసి సరఫరా నిలిపివేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా దిగి రాకపోవడంతో ఓ కానిస్టేబుల్ నీకు దండం పెడతా దిగన్నా.. నీ పిల్లలు ఆగమైతరు అని పదే పదే ప్రాధేయపడటంతో బాలరాజు కిందకు దిగి వచ్చాడు. కిందికి దిగిన బాలరాజు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు వెల్లడించారు.
TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసు.. నిందితులను రెండో రోజు విచారించనున్న ఈడీ
తాజావార్తలు
-
East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
-
Japan Roasts China: డ్రాగన్ దేశాన్ని నవ్వులపాలు చేసిన జపాన్.. అణు ఆయుధాలపై లైవ్లో మాస్ ర్యాగింగ్!
-
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
-
Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్కు బిగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..