Flyovers closed in Hyderabad: నెక్లెస్ రోడ్ క్లోజ్.. ఫ్లై ఓవర్లు బంద్.. పోలీసుల ప్రకటన
Flyovers closed in Hyderabad: హైదరాబాద్లో దాదాపు అన్ని ఫ్లై ఓవర్లు మూతపడనున్నాయి. గ్రీన్ల్యాండ్ ఫ్లైఓవర్, పిఎన్విఆర్ ఎక్స్ప్రెస్వే మరియు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మంగళవారం రాత్రి నుండి మూసివేయబడతాయి. ‘షబ్-ఏ-ఖాదర్’ జగ్నే కీ రాత్ సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే నెక్లెస్ రోడ్డు, పీవీఎన్ఆర్ రోడ్డులో వాహనదారులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ప్రజలు, వాహనదారులు ప్రకటన విడుదల చేశారు. ఏమైనా సమస్యలుంటే ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626కు సంప్రదించాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఆంక్షలను పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Read also: Health director srinivasrao: అంతా తాబీజ్ మహిమ.. అలా అనేసారేంటి..
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
‘షబ్-ఎ-ఖదర్’ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్నేళ్లుగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. కానీ చంద్రుని దర్శనం ప్రకారం, అమావాస్యను బట్టి ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో రంజాన్ పండుగను జరుపుకునే అవకాశం ఉంది.పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని ముస్లిం సోదరులు ఇస్లాంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఐపీఎల్ టోర్నీ..
మరోవైపు ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ముంబై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ హైవే నుంచి వచ్చే వాహనాలను చెంగిచర్ల, చర్లపల్లి, ఎన్జీసీ వైపు మళ్లిస్తారు. ఐపీఎల్ మ్యాచ్ని చూసేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చే అభిమానులతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగానే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మ్యాచ్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ను మళ్లిస్తారు. అలాగే స్టేడియానికి వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో, టీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అదనపు సర్వీసులు నడుస్తున్నాయి.
Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్
తాజావార్తలు
-
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
-
Raashii Khanna: పోలీస్ ఆఫీసర్గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్డేట్!
-
Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!