Flyovers closed in Hyderabad: నెక్లెస్ రోడ్ క్లోజ్.. ఫ్లై ఓవర్లు బంద్.. పోలీసుల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flyovers closed in Hyderabad: హైదరాబాద్లో దాదాపు అన్ని ఫ్లై ఓవర్లు మూతపడనున్నాయి. గ్రీన్ల్యాండ్ ఫ్లైఓవర్, పిఎన్విఆర్ ఎక్స్ప్రెస్వే మరియు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మంగళవారం రాత్రి నుండి మూసివేయబడతాయి. ‘షబ్-ఏ-ఖాదర్’ జగ్నే కీ రాత్ సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే నెక్లెస్ రోడ్డు, పీవీఎన్ఆర్ రోడ్డులో వాహనదారులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ప్రజలు, వాహనదారులు ప్రకటన విడుదల చేశారు. ఏమైనా సమస్యలుంటే ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626కు సంప్రదించాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఆంక్షలను పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Read also: Health director srinivasrao: అంతా తాబీజ్ మహిమ.. అలా అనేసారేంటి..
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
‘షబ్-ఎ-ఖదర్’ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్నేళ్లుగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. కానీ చంద్రుని దర్శనం ప్రకారం, అమావాస్యను బట్టి ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో రంజాన్ పండుగను జరుపుకునే అవకాశం ఉంది.పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని ముస్లిం సోదరులు ఇస్లాంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఐపీఎల్ టోర్నీ..
మరోవైపు ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ముంబై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ హైవే నుంచి వచ్చే వాహనాలను చెంగిచర్ల, చర్లపల్లి, ఎన్జీసీ వైపు మళ్లిస్తారు. ఐపీఎల్ మ్యాచ్ని చూసేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చే అభిమానులతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగానే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మ్యాచ్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ను మళ్లిస్తారు. అలాగే స్టేడియానికి వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో, టీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అదనపు సర్వీసులు నడుస్తున్నాయి.
Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్
తాజావార్తలు
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!