Kamareddy Bandh: నేడు కామారెడ్డి బంద్.. రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy Bandh: కామారెడ్డి రైతుల భూ పోరాటం తెలంగాణ మొత్తాన్ని ఉడికిస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ మంటలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని నిన్ననే నిరసనకు దిగిన రైతులు ఇవాళ బంద్కు కామారెడ్డి పిలుపునివ్వడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. కామారెడ్డి బంద్తో మరింత టెన్షన్ పెరిగింది. చేతిలో ఉన్న పంటపొలాలు ఆగమైతే మాస్టర్ ప్లాన్ ద్వారా మా పొలాలు ఎత్తుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పొలాలు కోల్పోతే మేము ఏం తినాలి? ఎక్కడికి పోవాలని కామారెడ్డి అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. మీ మాస్టర్ ప్లాన్ మాకొద్దంటూ మా పొలం మాకిచ్చెయ్యండి అంటూ కామారెడ్డి రైతు గోస మిన్నంటుతున్నాయి.
Read also: Veera Simha Reddy: బాలయ్య ఉగ్ర నరసింహుడి రూపంలో రానున్నాడు
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
నిన్న కలెక్టరేట్ ముట్టడితో ఉద్రికత్త చోటుచేసుకోవడంతో.. పోలీసుల ఎంట్రీ ఇవ్వడంతో తోపుట వాదోపవాదాలు జరిగాయి. దీంతో రైతులు నేడు కామారెడ్డి బంద్ కు పిలుపు నిచ్చారు. కామారెడ్డి రైతుల ఆందోళనకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మద్దతు పలికారు. నేడు రైతుల ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొనున్నారు. బాధిత రైతులకు సంఘీభావం తెలుపనున్నారు.
ఇక కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి అంత పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి ప్రజ్ క్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి.. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి కి కాంగ్రెస్ బృందం బయలు దేరింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు రెండు బృందాలుగా కామారెడ్డికి కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి ల నేతృత్వంలో ఒక బృందం.. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తోపాటు, సీనియర్ నాయకులు బృందంగా నాయకులు కామారెడ్డి కి బయలుదేరారు.
Read also: Asia Cup 2023: ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్.. ఒకే గ్రూప్లో భారత్, పాకిస్థాన్
అయితే కామారెడ్డి బంద్ సందర్భంగా పోలీసుల హై అలెర్ట్ ప్రకటించారు. కలెక్టరేట్ దగ్గర పరిణామాలతో భారీగా పోలీసుల మోహరించారు. రైతు జే.ఏ.సి., బీజేపీ ముఖ్య నేతల హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ వెంకట రమణా రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. బంద్ జరగనివ్వని పోలీసులుచెబుతున్నారు. దీంతో కామారెడ్డిలో రైతులు, బీజేపీ, కాంగ్రెస్ కు అడ్డుకునేందుకు పోలీసులు బారీగా మోహరించారు. కాగా.. కామారెడ్డిలో బంద్ పై హైటెన్షన్ మొదలైంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!