Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Farmer Tries To Save Paddy Nursery With Water Tankers In Sangareddy

Sangareddy: పొలానికి ట్యాంకర్‌ నీరే దిక్కు.. ఎంత కష్టం వచ్చిందయ్యా!

Published Date :July 11, 2024 , 8:37 pm
By Mahesh Jakki
  • ఆశలు రేపి ఉసూరుమనిపించిన నైరుతి రుతుపవనాలు
  • ఖరీఫ్‌ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలు ఆవిరి
  • ట్యాంకర్లతో వరినారును కాపాడుకుంటున్న రైతులు
Sangareddy: పొలానికి ట్యాంకర్‌ నీరే దిక్కు.. ఎంత కష్టం వచ్చిందయ్యా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sangareddy: రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్‌ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వాటర్‌ ట్యాంకర్‌లు అద్దెకు తీసుకొచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రైతులు నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని ఆకాశం వైపు చూస్తున్నారు. వారు నిద్రపోయే ముందు కూడా, వారు తమ పంటలను కాపాడుకోవడానికి వర్షాలు కురిసే అవకాశం ఉన్న మేఘాలేమైనా ఉన్నాయేమోనని చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో ఓ రైతు ఇక వర్షం పడుతుందనే ఆశను కూడా కోల్పోయాడు. చౌటకూర్‌కు చెందిన రైతు మన్నె లింగయ్య(65) తన వరి నారును కాపాడుకోవడానికి ట్యాంకర్‌కు రూ. 2వేలు ఖర్చు చేసి నీటిని తెప్పించుకుంటున్నారు. చౌటకూర్‌ మండల కేంద్రంలో 2.5 ఎకరాల భూమి ఉన్న లింగయ్య గ్రామంలోని ఓ రైతు నుంచి మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ మూడు ఎకరాల భూమి చౌటకూర్ శివార్లలో ఉన్న నాయని చెరువు ఆయకట్టులో భాగం. నాయని చెరువు ద్వారానే 70 ఎకరాల సాగు భూమి ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఈ సీజన్‌లో వర్షాలు లేక చెరువులో నీరు లేదు. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు రిజర్వాయర్‌లో తగినంత నీరు లేకపోవడంతో నీటిపారుదల అధికారులు మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోకి నీటిని విడుదల చేయడం లేదు.

Read Also: Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు

Also Read

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
  • Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్

లింగయ్య పొలం పక్కనే ఉన్న రైతు గామిని జోగయ్య వరినారు కూడా చాలా కాలంగా నీరు లేకపోవడంతో ఎండిపోయింది. రైతు మన్నె లింగయ్య మాట్లాడుతూ.. వరిని సాగు చేసేందుకు విత్తనాలకు, భూమి కౌలు కోసం, కూలీల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నామని.. ఇప్పుడు నీటి ట్యాంకర్ల ఖర్చు అదనంగా భారమైందన రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో.. వరి నారు ఎండిపోతోంది. ఆగస్టు 30 వరకు రుతుపవనాలు బలపడతాయని, వర్షాలు కురుస్తాయనే ఆశతో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సింగూరు జలాశయానికి ఎగువ మంజీర నుంచి ఇన్ ఫ్లో వస్తే రైతుల పోరాటాలు ముగుస్తాయని, సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీరు ఉండడంతో గత వానకాలం, యాసంగి సీజన్‌లలో వరి పంట బాగా పండిందని గుర్తుచేశారు.

గ్రామంలోని రైతులు పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండు మూడు సార్లు విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లింగయ్య మూడుసార్లు విత్తే ప్రక్రియను పూర్తి చేశాడు. పంట కోసం అతని ఖర్చు మూడు రెట్లు పెరిగింది. అయితే పత్తి పంట ఇప్పుడు కూడా సరిగా మొలకెత్తలేదు. లింగయ్య చెప్పినట్లు సంగారెడ్డి అంతటా రైతులు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులంతా ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. వర్షాలు పడి సింగూరు జలాశయంలోకి నీరు వస్తే వారి కష్టాలు గట్టెక్కనున్నట్లు తెలుస్తోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture
  • Farmers
  • medak district
  • River Manjeera
  • sangareddy

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions