Sangareddy: పొలానికి ట్యాంకర్ నీరే దిక్కు.. ఎంత కష్టం వచ్చిందయ్యా!
- ఆశలు రేపి ఉసూరుమనిపించిన నైరుతి రుతుపవనాలు
- ఖరీఫ్ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలు ఆవిరి
- ట్యాంకర్లతో వరినారును కాపాడుకుంటున్న రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లు అద్దెకు తీసుకొచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రైతులు నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని ఆకాశం వైపు చూస్తున్నారు. వారు నిద్రపోయే ముందు కూడా, వారు తమ పంటలను కాపాడుకోవడానికి వర్షాలు కురిసే అవకాశం ఉన్న మేఘాలేమైనా ఉన్నాయేమోనని చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్లో ఓ రైతు ఇక వర్షం పడుతుందనే ఆశను కూడా కోల్పోయాడు. చౌటకూర్కు చెందిన రైతు మన్నె లింగయ్య(65) తన వరి నారును కాపాడుకోవడానికి ట్యాంకర్కు రూ. 2వేలు ఖర్చు చేసి నీటిని తెప్పించుకుంటున్నారు. చౌటకూర్ మండల కేంద్రంలో 2.5 ఎకరాల భూమి ఉన్న లింగయ్య గ్రామంలోని ఓ రైతు నుంచి మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ మూడు ఎకరాల భూమి చౌటకూర్ శివార్లలో ఉన్న నాయని చెరువు ఆయకట్టులో భాగం. నాయని చెరువు ద్వారానే 70 ఎకరాల సాగు భూమి ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఈ సీజన్లో వర్షాలు లేక చెరువులో నీరు లేదు. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు రిజర్వాయర్లో తగినంత నీరు లేకపోవడంతో నీటిపారుదల అధికారులు మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోకి నీటిని విడుదల చేయడం లేదు.
Read Also: Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
లింగయ్య పొలం పక్కనే ఉన్న రైతు గామిని జోగయ్య వరినారు కూడా చాలా కాలంగా నీరు లేకపోవడంతో ఎండిపోయింది. రైతు మన్నె లింగయ్య మాట్లాడుతూ.. వరిని సాగు చేసేందుకు విత్తనాలకు, భూమి కౌలు కోసం, కూలీల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నామని.. ఇప్పుడు నీటి ట్యాంకర్ల ఖర్చు అదనంగా భారమైందన రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో.. వరి నారు ఎండిపోతోంది. ఆగస్టు 30 వరకు రుతుపవనాలు బలపడతాయని, వర్షాలు కురుస్తాయనే ఆశతో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సింగూరు జలాశయానికి ఎగువ మంజీర నుంచి ఇన్ ఫ్లో వస్తే రైతుల పోరాటాలు ముగుస్తాయని, సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీరు ఉండడంతో గత వానకాలం, యాసంగి సీజన్లలో వరి పంట బాగా పండిందని గుర్తుచేశారు.
గ్రామంలోని రైతులు పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండు మూడు సార్లు విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లింగయ్య మూడుసార్లు విత్తే ప్రక్రియను పూర్తి చేశాడు. పంట కోసం అతని ఖర్చు మూడు రెట్లు పెరిగింది. అయితే పత్తి పంట ఇప్పుడు కూడా సరిగా మొలకెత్తలేదు. లింగయ్య చెప్పినట్లు సంగారెడ్డి అంతటా రైతులు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులంతా ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. వర్షాలు పడి సింగూరు జలాశయంలోకి నీరు వస్తే వారి కష్టాలు గట్టెక్కనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!