B. Vinod Kumar: బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్ష పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని అంటున్నారని తెలిపారు. కొట్ల రూపాయిలు చేతులు మారాయి అని అంటున్నారు… దీని పై ED ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? అని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు చేతులు మారితే ED వెంటనే కేసు నమోదు చేస్తుంది….ఇప్పుడు ఎందుకు కేసు నమోదు చెయ్యలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాల మంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొపెసర్ లతో మాట్లాడిన….. నీట్ ద్వారా మన రాష్ట్రానికి లాభం జరిగిందా లేదా అన్నది చర్చ చేశానన్నారు.
Read also: Chhattisgarh : రూ.లక్ష కోసం మళ్లీ పెళ్లికి రెడీ అయిన పెళ్లయిన 20జంటలు
2015 నుండి నీట్ పరీక్ష మన విద్యార్థులు రాస్తున్నారు. 15 శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకీ పోతున్నాయన్నారు. నీట్ పరీక్షలో సీటు వచ్చిన వేరే రాష్ట్రాలకు మన పిల్లలు పోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయి….మరికొన్ని మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఒక్కటే కోరుతున్నానని, నీట్ పరీక్ష పై మన పిల్లలకు లాభం జరుగుతుందా , నష్టం జరుగుతుందా ఎక్స్ పర్ట్ కమిటీ వెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. మన రాష్ట్రంలో మంచి ఎక్స్ పర్ట్ ఉన్నారు, వారితో ఒక కమిటీ వేసి నీట్ పరీక్ష పై ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు…. మనం అదే బాటలో ముందుకు వెళ్దామన్నారు.
Lover Attack: పాత బస్తీలో దారుణం.. కత్తిపీటతో ప్రియురాలిని గొంతు కోసిన ప్రియుడు..