Etela Rajender: ఇదంతా సీఎం కేసీఆర్ స్కెచ్.. ఇదో పిరికి చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Reacts On Assam CM Himantha Biswa Sarma Incident: గణేశ్ నిమజ్జనం ఉత్సవ కమిటీలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేత నందుబిలాల్ అడ్డుకున్న ఘటనను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కుట్రేనని ఆరోపించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని అవమానపరిచిన బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీన్నొక పిరికి చర్యగా అభివర్ణించిన ఆయన.. ప్రజల విశ్వాసం ఉన్న వాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడరని అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే ఇలాంటి దాడులకు దిగుతారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పోయేకాలం వచ్చిందని, అందుకే గణేష్ నిమజ్జనం ఉత్సవాల సమయంలో ఇటువంటి పని చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని.. ఎవరు, ఏం చేస్తున్నారో అంత గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇటువంటి చర్యల్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారని తాను భావిస్తున్నానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
చిల్లర మాటలు మాట్లాడటంలో సీఎం కేసీఆర్ని మించిన వారెవరూ లేరని ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యల్ని వినలేదని, అయితే ఆయన కేసీఆర్లాగా సంస్కారహీనంగా మాట్లాడి ఉండరని తెలిపారు. బాధ్యత మరిచి ఎవరూ వ్యవహరించరని తాను భావిస్తున్నానన్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఈటెల విమర్శించారు. పోలీసుల సహకారం లేనిదే, ఇలాంటివి సాధ్యం కాదని ఆరోపణలు చేశారు. మన తెలంగాణలో పోలీస్ వ్యవస్థ గొప్పగా ఉందని వాళ్లే చెప్పుకుంటున్నారని, పోలీసుల వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందని తాను చెప్పడం లేదని, కాకపోతే ప్రభుత్వమే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ చర్యకి పాల్పడి ఉంటుందని తాను భావిస్తున్నానన్నారు. దీనిపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
ఇదే సమయంలో తమిళిసై వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గత రెండున్నరేళ్ల నుంచి కేసీఆర్ అవమానిస్తుండడం వల్లే ఆమె అలా వ్యాఖ్యానించారని అన్నారు. అయితే.. గవర్నరే తన చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 2023 వరకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అపహాస్యం చేయకుండా ఉండాలని కేసీఆర్కు సూచించారు. ఈసారి ఎన్నకల్లో కేసీఆర్ ఓటమి తథ్యమని, ఆయనకు మంచి జరిగే ఆస్కారమైతే లేదని ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!