ఉపఎన్నిక ఎక్కడ వచ్చినా వరాలు కేసీఆర్ సాంప్రదాయం.. ఈటల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రం ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినా.. అక్కడ వరాల జల్లు కురిపించడం సీఎం కేసీఆర్ సాంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోనీ ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నాను.. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నా.. నా రాజీనామా తర్వాత అయినా పెన్షన్లు, పింఛన్లు వస్తాయని భావిస్తున్నానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెన్షన్, రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారందరీకీ వెంటనే ఇవ్వాలని.. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఇక, పరిపాలన సౌలభ్యం కోసం చల్లూరిని, వావిలలనీ మండలాలు చేయాలని కోరారు.. సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాలే.. వెంటనే ఇవ్వాలన్నారు.. మరోవైపు.. ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా కేసీఆర్ వరలా జల్లు సాంప్రదాయమంటూ ఎద్దేవా చేసిన ఈటల.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్కరూపాయి ఇవ్వలేదు.. ఎవరూ రాలేదని గుర్తుచేసుకున్నారు.. నా నియోజకవర్గంలో అన్ని ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా గెలిచిన నియోజకవర్గం.. నా నియోజకవర్గంలో మమ్మళ్లీ విడదీసే ప్రయత్నం చేస్తున్నారు… చేశారు… ఇది నీచం అంటూ మండిపడ్డారు.
మిడతలదండు దాడి చేసినట్టు టీఆర్ఎస్ వాళ్లు దాడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల.. మేం గాలికి గెలిసిన వాళ్లం కాదు.. 2004 నుండి ఇప్పటివరకు మెజారిటీతోనే గెలుస్తున్నానని.. 2004లో పది గెలిచాం అందులో ఒకటి హుజూరాబాద్ అని గుర్తుచేశారు. ఇక, నేను పార్టీ పెడుతున్నాంటు విషప్రచారం చేశారు.. ప్రాణం ఉండగానే బొందపెట్టాలని చూశారు.. కానీ, ఆ బొందలో నీ ప్రభుత్వమే పడుతుందని కామెంట్ చేశారు.. ఎన్నికల వచ్చాయి అంటే డబ్బులతో వస్తారు.. కానీ, మా ప్రజల లొంగరని స్పష్టం చేశారు.. ఈటలను గెలిపించుకోవడం అంటే మనం మనం గెలిచినట్టుగా మా ప్రజలు భావిస్తున్నారన్న ఆయన.. తెలంగాణ గ్రామాలలో… గ్రామాలు బాగూంటే బంగారం తెలంగాణ సాధ్యం అని చెప్పాను.. ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పిన అది తప్పా? అని ప్రశ్నించారు.. కొంతమంది చెంచగాళ్ళను తయారు చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించిన ఈటల.. 2018 ఎన్నికలలో నా ప్రత్యర్థి కి డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.. కరపత్రాలు కొట్టించినా.. డబ్బులు పంపినా ఓపిక పట్టాం అన్నారు. ఇప్పుడు ధర్మ యుద్ధం జరగబోతోంది.. ఈ యుద్ధంలో హుజూరాబాద్ ప్రజలే గెలుస్తారని వ్యాఖ్యానించారు. అఆర్ఎస్ ఎన్ని ఎత్తుగడలు చేసిన డబ్బుల సంచులతో సాధ్యం కాదన్న ఈటల.. మంత్రి గంగుల మాటలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. వాళ్లలాగా డబ్బుని నేను నమ్ముకోలేదన్నారు.. ఇక, హరీష్రావుకి ఆత్మగౌరవం ఉందో.. నాకు ఉందో ప్రజలకు తెలుసని కామెంట్ చేశారు ఈటల రాజేందర్.
Also Read
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
తాజావార్తలు
-
UP: సమాజ్వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
-
Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
-
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్పై 3-1 తేడాతో.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!