Etela Rajender: ఇది కేసీఆర్ తెరలేపిన కొత్త నాటకం.. కాంగ్రెస్ని ముంచింది ఆయనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Comments On Moinabad Farm House Issue: మొయినాబాద్ ఫామ్ హౌస్తో కేసీఆర్ సరికొత్త నాటకానికి తెరలేపాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిశోర్ని కేసీఆర్ కలిస్తే.. తెలంగాణను గోల్మాల్ చేస్తాడని అనుకున్నామని, ఇప్పుడు అదే జరుగుతోందని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసే సంప్రదాయం కేసీఆర్ది అని ధ్వజమెత్తారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఆ పార్టీ కొంప ముంచిన నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు. సీఎంను ప్రశ్నిస్తే మంత్రి పదవి పోతుందని తెలిసి కూడా తాను అడిగానని, మంత్రిగా ఉన్నపుడే టీఆర్ఎస్ పార్టీకి ఓనర్ని అని తాను చెప్పానన్నారు. హుజూరబాద్లో కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెడితే.. పసుపు బొట్టు తో ప్రమాణాలు చేయించిన హుజురాబాద్ ప్రజలకు ఆయనకు చెంప చెళ్లుమనించారని పేర్కొన్నారు. ఒక చెంప హుజూరాబాద్ ప్రజలు పగలగొడితే.. ఇంకో చెంప పగలగొట్టే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందన్నాడు. 3వ తేదీన మునుగోడు ఆత్మగౌరవం నిలబెట్టుకునెలా ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అటు.. రాజగోపాల్ రెడ్డి కూడా నలుగురు ఎమ్మెల్యేలను కొంటున్నారని పెద్ద డ్రామా చేశారంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారా,వు గువ్వల బాలరాజుకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. మునుగోడుకి వచ్చి.. ఇక్కడున్న సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీల్ని టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. లీడర్లను కొన్న కేసీఆర్.. మునుగోడు ప్రజల్ని కొనగలడా? లీడర్లు అమ్ముడుపోయారు.. మీరు అమ్ముడుపోతారా? అంటూ మునుగోడు ప్రజల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. తాను రాజీనామా చేయకపోతే.. ఈరోజు మీ ఊర్లకు ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ వచ్చేవారా? అని నిలదీశారు. తాను రాజీనామా చేసి, మీ కాళ్ళ దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!