Etela Rajender: కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే.. తెలంగాణ ప్రజలు క్షమించరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Comments On KCR In BJP Munugodu Meeting: వామపక్షాలు తెలంగాణ సీఎం కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేస్తే, తెలంగాణ ప్రజలు ఏమాత్రం క్షమించరని అన్నారు. మునుగోడు సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మిత్రుడని, మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే ఆయన రాజీనామా చేశాడని అన్నారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పదవి వదులుకున్న ఆయన్ను.. నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరారు. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ కన్నా గొప్ప తీర్పు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మునుగోడులో బీజేపీ వస్తే ఏం జరుగుతుందోనని కేసీఆర్ భయపడుతున్నారని, ఆ భయంతోనే నిన్న మునుగోడులో సభ నిర్వహించారని ఈటెల విమర్శించారు. బీజేపీ సభ సక్సెస్ కాకూడదనే ఆ కుట్ర పన్నారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే బంగాళఖాతంలో వేస్తారని కేసీఆర్ తన గురించే చెప్పుకున్నారని, అది తప్పకుండా జరుగుతుందని చెప్పారు. ఓటమి భయం చుట్టుకోవడం వల్లే.. మోటార్లకు మీటర్లు పెడ్తారన్న అబద్ధప్పు ప్రచారానికి కేసీఆర్ తెరతీశారన్నారు. ఇదే సమయంలో వామపక్ష నాయకులు కేసీఆర్తో కలవడం కన్నా హీనమైన చర్య మరొకటి లేదని విమర్శించిన ఆయన.. మీరెప్పుడైనా ప్రగతి భవన్ వెళ్లారా? అంటూ సీపీఐ, సీపీఎం నాయకుల్ని ప్రశ్నించారు. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు నిషేధించిన నాయకుడు కేసీఆర్ అని, ట్రేడ్ యూనియన్లు లేకుండా చేసిన ఘనత కూడా ఆయనదేనని ఈటెల రాజేందర్ వెల్లడించారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ట్రేడ్ యూనియన్లు సమ్మె చేస్తే.. ఏనాడైనా పిలిచి సమస్యను పరిష్కరించారా? అంటూ ఈటెల నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణం కాదా? ఎన్నో కుట్రలు చేసిన కేసీఆర్ ప్రగతి కామకుడిగా కనిపించాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యావాలంటీర్లకు కూడా జీతాలు ఇవ్వడం లేదన్నారు. వారి బాధలు మీకు అర్థం అవుతోందా? అని సీఎంని అడిగే దమ్ముందా? అంటూ ఈటెల ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీని ఓడించి, బీజేపీని గెలిపించాల్సిందిగా ఈటెల కోరారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!