వరంగల్ జిల్లా కమలాపూర్ చేరుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్… స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం హుజూరాబాద్ బయలు దేరిన ఈటల… అక్కడ జరిగే ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. హుజూరాబాద్ లో నియోజక వర్గంలోని ప్రజాప్రతనిధులు అభిమానులను కలువనున్న ఈటల… అక్కడ ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తికంగా మారింది. అయితే ఈటలను మంత్రి వర్గం నుండి తొలగించినప్పటి నుండి ఆయన ఏం చేస్తారు.. ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేదాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు.