Errabelli Dayakar Rao: ఆ కంపెనీ ద్వారా వచ్చే డబ్బులతో.. నాయకుల్ని కొంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao Shocking Comments On Moinabad Episode: మొయినాబాద్ ఫాంహౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన బేరసారాల వ్యవహారంపై మంత్రి ఎర్రబెట్టి దయాకర్ రావు తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, దాన్ని పోలీసులు చూసుకుంటారని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి చెందిన సుషి కంపెనీ ద్వారా డబ్బులను పంపిణీ చేస్తూ.. నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అడ్డంగా ఆడియోలు, వీడియోలు దొరికిన తరువాత కూడా ప్రమాణాలు చేస్తే.. ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక చండూర్లో జరిగే సీఎం కేసీఆర్ సభకు భారీ స్థాయిలో జనం తరలి వస్తున్నారని, ఈ సభలో మునుగోడు అభివృద్ధిపైనే సీఎం మాట్లాడుతారని తెలిపారు.
అంతకుముందు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అధికార దాహంతోనే అంధకారంలో ఉన్న బీజేపీ, ప్రజాస్వామ్యంతో పరిహాసం ఆడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంతో పనిలేకుండా ధనస్వామ్యంతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వానికి బీజేపీ తెరతీసిందన్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల్లో సాగినట్టు బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని.. కోట్లు, కాంట్రాక్టులు, పదవులు ఆశగా చూపెట్టి తమ ఎమ్మెల్యేలను ఆ పార్టీ కొనలేదని అన్నారు. బీజేపీ చేసిన కొనుగోలు కుట్రలను తిప్పికొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడంతోనే బీజేపీకి భయం పట్టుకుందని.. ఎక్కడ తమ ఢిల్లీ పీఠం కదులుతుందోనన్న భయంతోనే ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, టీఆర్ఎస్పై బురద జల్లేందుకు ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవలేకే.. బీజేపి ఈ కుట్రకు తెరతీసిందని పేర్కొన్నారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!