Errabelli Dayakar Rao: కేంద్రం వాటిని కట్టొద్దని చెప్పి, నిధులు ఆపేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao On Nalgonda Development: రైతు కళ్ళాలు, రైతు వేదికలు కట్టొద్దని కేంద్రం చెప్తోందని.. రావాల్సిన నిధుల్ని సైతం ఆపేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 703 కోట్లు రావాల్సి ఉండగా.. రైతు కళ్లాల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేశామన్న కారణంతో ఆ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని, మిషన్ భగీరథ కోసం కూడా ఆ జిల్లాకు దాదాపు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల కారణంగా.. గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. అయితే.. కొంతమంది కావాలనే కిస్తీలకు డబ్బులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సీఎం కేసిఆర్ ఆదేశమని, ఆయన ఆదేశాల మేరకు అన్ని రోడ్లు వేస్తామని దయాకర్ రావు హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామ పంచాయతీలు, ఇతర రాష్ట్రాలలోని పట్టణాలతో పోటీ పడుతున్నాయని అన్నారు. గ్రామాలకు వలసలు తిరిగి వస్తున్నాయని.. నిజాయితీగా పని చేసిన సర్పంచులు, ఆ గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులను పొందుతున్నారని అన్నారు. అయితే.. కొంతమంది డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అటు.. కేంద్రం కూడా రాష్ట్రానికి రావలసిన డబ్బులను ఆపేసి, ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద మంచి పనులు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం.. ఆ పథకాన్ని ఆపే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గతంలో కేంద్రం నుంచి ఒక టీమ్లో ముగ్గురు అధికారులు వచ్చి చూసేవారని, కానీ ఈసారి 18 టీమ్స్ వచ్చి చూడడం విశేషమని తెలిపారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!