Errabelli Dayakar Rao: కేంద్రం వాటిని కట్టొద్దని చెప్పి, నిధులు ఆపేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao On Nalgonda Development: రైతు కళ్ళాలు, రైతు వేదికలు కట్టొద్దని కేంద్రం చెప్తోందని.. రావాల్సిన నిధుల్ని సైతం ఆపేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 703 కోట్లు రావాల్సి ఉండగా.. రైతు కళ్లాల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేశామన్న కారణంతో ఆ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని, మిషన్ భగీరథ కోసం కూడా ఆ జిల్లాకు దాదాపు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల కారణంగా.. గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. అయితే.. కొంతమంది కావాలనే కిస్తీలకు డబ్బులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సీఎం కేసిఆర్ ఆదేశమని, ఆయన ఆదేశాల మేరకు అన్ని రోడ్లు వేస్తామని దయాకర్ రావు హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామ పంచాయతీలు, ఇతర రాష్ట్రాలలోని పట్టణాలతో పోటీ పడుతున్నాయని అన్నారు. గ్రామాలకు వలసలు తిరిగి వస్తున్నాయని.. నిజాయితీగా పని చేసిన సర్పంచులు, ఆ గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులను పొందుతున్నారని అన్నారు. అయితే.. కొంతమంది డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అటు.. కేంద్రం కూడా రాష్ట్రానికి రావలసిన డబ్బులను ఆపేసి, ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద మంచి పనులు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం.. ఆ పథకాన్ని ఆపే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గతంలో కేంద్రం నుంచి ఒక టీమ్లో ముగ్గురు అధికారులు వచ్చి చూసేవారని, కానీ ఈసారి 18 టీమ్స్ వచ్చి చూడడం విశేషమని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!