Errabelli Dayakar Rao : బండి గుండుపై ఇనుప గుండ్లు పెడుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబుబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన ఒక రోజు ఉక్కు దీక్ష విరమణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సిగ్గులేకుండా జనంలో తిరుగుతుందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు కంటే బయ్యారం ఉక్కు నాణ్యమైనదని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ గుండు పై ఇనుప గుండ్లు పెడుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి లేకపోతే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించండి అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని, బయ్యారం ఉక్కు లేదు, కోచ్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నింటినీ బీజేపీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సవరణ చేయాలని కేసీఆర్ అన్నారని, అందులో తప్పు ఏమిలేదు, రాష్ట్ర లకు అధికారులు ఇవ్వాలనడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీలను నిలదీయండి, తెలంగాణ సాధించిన విధంగా మరొక ఉద్యమం చేసి ఉక్కు పరిశ్రమ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!