Alleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం.. ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alleti Maheshwar Reddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ముందు గేటుకు తాళం వేసి పోలీసులను లోనికి అనుమతించలేదు. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. గేటు తాళం పగులగొట్టి మహేశ్వరరెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. వైద్య పరీక్షలు చేయించుకోవాలని మహేశ్వర్ రెడ్డికి పోలీసులు సూచించగా, అందుకు నిరాకరించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మాస్టర్ ప్లాన్ జేవీ 220ని రద్దు చేసే వరకు దీక్ష విరమించేది లేదని మహేశ్వర్ రెడ్డి ఆస్పత్రిలో తెలిపారు.
Read also: Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అక్కడే.. హాజరుకానున్న అతిరథ మహారథులు!
Also Read
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షలకు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. కిషన్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సంఘీభావం తెలిపారు. కొందరు నేరుగా వెళ్లి ఆయనతో మాట్లాడి మద్దతు తెలుపగా మరికొందరు ఫోన్లో పరామర్శించారు. ఆదివారం మహేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ్, ధర్మపురి అరవింద్ ప్రయత్నించి విఫలయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలపడంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికి తోడు ఎవరూ రాలేదు. మహేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు డీకే అరుణ, అరవింద్లను కూడా అనుమతించలేదు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిర్మల్లో బీజేపీ శ్రేణులు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. బైల్బజార్ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గుమిగూడారు. అక్కడి నుంచి నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మరోవైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. దీనికి ప్రతిగా ఈరోజు (సోమవారం) ఇంద్రకరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పోటాపోటీ రాజకీయ వ్యూహాలతో నిర్మల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Donald Trump: భారత్కు ట్రంప్ షాక్.. తాను అధ్యక్షుడైతే భారతీయ ఉత్పత్తులపై భారీ పన్ను
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!