Mahabubabad: ఆ కాలనీకి ఒకటే కరెంట్ మీటర్.. బిల్లు ఎంత వచ్చిందంటే..!
- మహబూబాబాద్లో ఒక్క కరెంట్ మీటర్తో 300 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్
- అధికారులు సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసుల వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఇక పచ్చని పల్లెలు ప్రగతికి మెట్లు అని పెద్దలు అంటుంటారు. అంతేకాదు.. కేంద్రం ప్రభుత్వం వికసిత్ భారత్ కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగాను దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం ఇంకా మార్పు కనిపించడం లేదు.
ఇది కూడా చదవండి: Israel-Hezbollah: ఇజ్రాయిల్-హిజ్బొల్లా మధ్య యుద్ధ మేఘాలు.. లెబనాన్లోని ఇండియన్స్కి కేంద్రం జాగ్రత్తలు..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
అది తెలంగాణలోని జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ ప్రాంతం. 28 వార్డులోని మంద కొమురయ్య కాలనీ. దాదాపు ఇక్కడ 300 ఇళ్లులు ఉన్నాయి. ప్రజలు చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. కానీ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతులు కల్పించాల్సిన అధికారులు మాత్రం ముఖం చాటేశారు. దీంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. దీంతో చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. పురపాలక సంఘం నెంబర్లు కూడా కేటాయించింది. కానీ విద్యుత్ సౌకర్యాన్ని మరిచింది. కనీసం ఒక్క వీధి దీపాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. చీకట్లోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు.
ఇది కూడా చదవండి: Snakebite: ఏడాదిలో పాముకాటులో 50,000 మంది మృతి, ప్రపంచంలోనే అత్యధికం
అయితే పరిశ్రమ కోసం ఒకరు విద్యుత్ మీటర్ తెప్పించుకున్నారు. అంతే ఆ ఒక్క మీటర్పైనే అందరూ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు వెలిగించుకుంటున్నారు. కర్రలు, చెట్లే ఊతంగా సర్వీసులు లాక్కున్నారు. తాటిచెట్టుకు ఒక స్ట్రీట్ లైటు ఏర్పాటు చేసుకున్నారు. కొమ్మల సాయంతో విద్యుత్ కనెక్షన్లు లాక్కున్నారు. అయితే ఈ ఒక్క మీటరకే ప్రతీ నెల రూ.65 వేలు కరెంట్ బిల్లు వస్తుంది. ఇప్పటి దాకా అందరూ తలా కొంత వేసుకుని చెల్లిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు కట్టాలంటూ కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం మానేశారు. దీంతో ఈ బిల్లు రూ.2.65 లక్షలకు చేరింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని కాలనీ వాసులు వాపోతున్నారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు తమకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే పురపాలక సంఘం ఖర్చులు భర్తిస్తే.. వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన అక్రమ సంబంధం.. ఏం జరిగిందంటే..!
తాజావార్తలు
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!