Mahabubabad: ఆ కాలనీకి ఒకటే కరెంట్ మీటర్.. బిల్లు ఎంత వచ్చిందంటే..!
- మహబూబాబాద్లో ఒక్క కరెంట్ మీటర్తో 300 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్
- అధికారులు సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసుల వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఇక పచ్చని పల్లెలు ప్రగతికి మెట్లు అని పెద్దలు అంటుంటారు. అంతేకాదు.. కేంద్రం ప్రభుత్వం వికసిత్ భారత్ కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగాను దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం ఇంకా మార్పు కనిపించడం లేదు.
ఇది కూడా చదవండి: Israel-Hezbollah: ఇజ్రాయిల్-హిజ్బొల్లా మధ్య యుద్ధ మేఘాలు.. లెబనాన్లోని ఇండియన్స్కి కేంద్రం జాగ్రత్తలు..
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
- HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
అది తెలంగాణలోని జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ ప్రాంతం. 28 వార్డులోని మంద కొమురయ్య కాలనీ. దాదాపు ఇక్కడ 300 ఇళ్లులు ఉన్నాయి. ప్రజలు చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. కానీ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతులు కల్పించాల్సిన అధికారులు మాత్రం ముఖం చాటేశారు. దీంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. దీంతో చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. పురపాలక సంఘం నెంబర్లు కూడా కేటాయించింది. కానీ విద్యుత్ సౌకర్యాన్ని మరిచింది. కనీసం ఒక్క వీధి దీపాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. చీకట్లోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు.
ఇది కూడా చదవండి: Snakebite: ఏడాదిలో పాముకాటులో 50,000 మంది మృతి, ప్రపంచంలోనే అత్యధికం
అయితే పరిశ్రమ కోసం ఒకరు విద్యుత్ మీటర్ తెప్పించుకున్నారు. అంతే ఆ ఒక్క మీటర్పైనే అందరూ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు వెలిగించుకుంటున్నారు. కర్రలు, చెట్లే ఊతంగా సర్వీసులు లాక్కున్నారు. తాటిచెట్టుకు ఒక స్ట్రీట్ లైటు ఏర్పాటు చేసుకున్నారు. కొమ్మల సాయంతో విద్యుత్ కనెక్షన్లు లాక్కున్నారు. అయితే ఈ ఒక్క మీటరకే ప్రతీ నెల రూ.65 వేలు కరెంట్ బిల్లు వస్తుంది. ఇప్పటి దాకా అందరూ తలా కొంత వేసుకుని చెల్లిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు కట్టాలంటూ కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం మానేశారు. దీంతో ఈ బిల్లు రూ.2.65 లక్షలకు చేరింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని కాలనీ వాసులు వాపోతున్నారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు తమకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే పురపాలక సంఘం ఖర్చులు భర్తిస్తే.. వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన అక్రమ సంబంధం.. ఏం జరిగిందంటే..!
తాజావార్తలు
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!