Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. కానీ అక్కడ 4 గంటల వరకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
Read also: మహాయుతిలో సీట్ల పంపకానికి గ్రీన్ సిగ్నల్.. బీజేపీకి 28, శివసేన-ఎన్సీపీకి..?
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
అయితే తెలంగాణలో ఎండల తీవ్రత ఓటింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని ఈసీకి నివేదించింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం తెలంగాణలో పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించాలని ఈసీ నిర్ణయించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Read also: Delhi High Court : అనుమతి లేకుండా ఫీజులు పెంచొద్దు.. ప్రభుత్వ సర్క్యులర్ను నిషేధించిన హైకోర్టు
దీని ప్రకారం సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న పోలింగ్ జరగనున్నందున.. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పోలింగ్ సమయాన్ని 6 గంటల వరకు పొడిగించాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్కు అనుమతించారు.
Read also: Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్
రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కు అనుమతిస్తే ఓటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్కు పలు వినతులు అందాయి. అన్ని రాష్ట్రాలు గంటపాటు సమయాన్ని పొడిగించడంతో ఇక్కడ కూడా గంట పొడిగించేందుకు ఈసీ అనుమతించింది.
సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉన్న నియోజకవర్గాలు
అసెంబ్లీ నియోజకవర్గం : లోక్సభ నియోజకవర్గ పరిధి
1. సిర్పూర్ : ఆదిలాబాద్
2. ఆసిఫాబాద్ : ఆదిలాబాద్
3. చెన్నూరు : పెద్దపల్లి
4. బెల్లంపల్లి : పెద్దపల్లి
5. మంచిర్యాల : పెద్దపల్లి
6. మంథని : పెద్దపల్లి
7. భూపాలపల్లి : వరంగల్
8. ములుగు : మహబూబాబాద్
9. భద్రాచలం : మహబూబాబాద్
10. పినపాక : మహబూబాబాద్
11. ఇల్లందు : మహబూబాబాద్
12. కొత్తగూడెం : ఖమ్మం
13. అశ్వారావుపేట : ఖమ్మం
Nagari Politics: నగరిలో రోజా వ్యతిరేక వర్గానికి షాక్.. కీలకనేతపై సస్పెన్షన్ వేటు..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!