Tragedy: తండ్రి తెచ్చిన చాక్లెట్ చిన్నారి ప్రాణం తీసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: తండ్రి తన గారాల బిడ్డకోసం ఎంతో ఇష్టంతో విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్ తన బిడ్డ ప్రాణాలే బలి గొంటుందని ఊహించలేక పోయాడు. నాన్న తెచ్చిన చాక్లెట్ లను తీసుకుని చిన్నారి స్కూల్ లో తిండామనుకున్నాడు. కానీ ఆ చాక్లెట్ బాలుడికి శాపంగా మరింది. అది తిన్న ఆ చిన్నారికి ఊపిరి ఆడలేదు. కాసేపు నరకయాతన అనుభవించాడు. చివరకు ప్రాణాలు వదిలాడు. విగత జీవిగా మిగిలాడు. ఈ ఘటన వరంగల్ పట్టణంలోని పిన్నవారి వీధిలో చోటుచేసుకుంది.
Read also: Bird Flu: అమెరికాలో ఏవియన్ ఫ్లూ విలయం… ఐదు కోట్ల కోళ్లు బలి
Also Read
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్కు చెందిన కన్గహాన్సింగ్ 20 ఏళ్ల క్రితం వరంగల్కు వలస వచ్చి జేపీఎన్ రోడ్లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. తనకు భార్య గీత, ముగ్గురు కుమారులు.. కుమార్తెతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు లైన్లో నివాసం ఉంటున్నాడు. ఇక.. వ్యాపార పనుల్లో భాగంగా కన్గహాన్ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి వస్తూ తన చిన్నారుల కోసం అక్కడి నుంచి చాక్లెట్లు తెచ్చాడు. ఇక.. కన్గహాన్ రెండో కుమారుడు ఎనిమిదేళ్ల సందీప్ వరంగల్ పిన్నావారి వీధిలోని శారదా పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. తనకి అన్న, సోదరి కూడా ఇదే స్కూల్ విద్యార్థులు. కన్గహాన్సింగ్ పిల్లలను బైక్పై స్కూల్కి తీసుకెళ్లేముందు తల్లి వాళ్లకు చాక్లెట్లు ఇచ్చింది. తండ్రి తెచ్చిన చాక్లెట్లను తింటూనే పిల్లలు బైక్ ఎక్కారు. చాక్లెట్ నోట్లోనే పెట్టుకుని పాఠశాల మొదటి అంతస్తులోని క్లాస్ రూంకి వెళ్లిన సందీప్ కాసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించడంతో కన్గహాన్సింగ్ హుటాహుటిన వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కున్నట్లు గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే సందీప్ ఊపిరాడక చనిపోయాడు. నిన్న (శనివారం) సాయంత్రం సందీప్ అంత్యక్రియలు నిర్వహించారు. సందీప్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి ప్రేమతో తెచ్చిన చాక్లెట్ అప్పుడే తన ముందు ఆడుకుంటూ బాయ్ బాయ్ అమ్మ అంటూ వెళ్లిన తన కన్న కొడుకు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తీరని శోకాన్ని మిగిల్చింది. తన కొడుకును తలచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు.
Students Fell ill: రెండు పాఠశాలల్లో 50 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..