Tension in OU: ఓయూలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension in OU: ఓయూలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. విద్యార్థి జాక్ టీపీసీసీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. దిష్టిబొమ్మ దాహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ విద్యార్థుల నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంద్ర పార్క్ ర్యాలీగా విద్యార్థులు బయలుదేరారు. మంత్రి తలసాని కి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మోహరించడండో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అయితే రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని లేదంటే, దున్నపోతులతో, గొర్రె పొట్టేలు తో గాంధీ భవన్ ను ముట్టడిస్తామని గొల్ల కురుమల పోరాట సమితి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కి మద్దతుగా టీ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. చీఫ్ రేవంత్ రెడ్డి యాదవులను కించపరచలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారేతప్ప యాదవుల గురించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఇక..తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారని, ఆయనను పిసికేస్తానని కామెంట్లు చేశారని, గాంధీభవన్ ను ముట్టడిస్తామని వారు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
గాంధీ భవన్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ప్రియాంక గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని టీపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లురవి పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ పేరుతో ఆ నాయకులు చేస్తున్నది పొలిటికల్ టూరిజమేనా అంటూ ప్రశ్నించారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కారణమన్నారు. తల పొగరుతో తలసాని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారని అన్నరు. ఈ మాటలకు యాదవులకు అంటగట్టి కుల రాజకీయాలకు తెరలేపారు అని టీపీసీసీ ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఇక గాంధీ భవన్ జోలికొస్తే తెలంగాణా భవన్ ను పేల్చేస్తామని అద్దంకి దయాకర్ అన్నారు. అయితే అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటి నుంచి తలసానిని తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అని పిలుస్తామని వారు పేర్కొన్నారు.
Tucker: ఈ కుక్క ఏడాదికి రూ.8కోట్లు సంపాదిస్తుంది
తాజావార్తలు
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!