EC Shock For 119 Parties: 119 పార్టీలకు ఈసీ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని ఈసీ.. కేంద్రన్యాయ శాఖను కోరిన విషయం తెలిసిందే. కానీ.. కేంద్రం నుంచి రిప్లై రాకముందే రంగంలోకి దిగింది ఈసీ.. రాష్ట్రంలో లోని 119 రాజకీయ పార్టీలకు ఈసీ నోటీసులు జారీచేసింది. రాజకీయ పార్టీల ఆదాయ ఖర్చులపై ఈనెలాఖరు వరకు సమాధానం ఇవ్వాలని సూచించింది. ఒకవేళ సమాధానం ఇవ్వలేని పక్షంలో వారి పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని వెల్లడించింది. ఈసీ నోటీసులు ఇచ్చిన పార్టీలో జనసేన, తెలంగాణ జన సమితి, లోక్ సత్తా, తెలంగాణ ఇంటిపార్టీ, నవ తెలంగాణ, ప్రజాశాంతి, తెలంగాణ తల్లి, సమాజ్ వాదీ ఫార్వర్డ బ్లాక్, జై స్వరాజ్, జనరాజ్యం, మన తెలంగాణ పార్టీలు ఉన్నాయి. ఈనెలాఖరులోగా సంబంధిత వివరాలు అందించాలని ఆపార్టీలకు పేర్కొంది.
read also: India vs England : దుమ్ములేపిన హర్దిక్ పాండ్యా.. భారత్ ఘన విజయం
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఏదో ఒక చిరునామాతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించడం, ఎన్నికల్లో గుర్తుపై పోటీ చేయడం తరువాత కనుమరుగైపోయిన దేశంలో 198 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసినట్లు ఈసీ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు.. 57 ప్రాంతీయ పార్టీలున్నట్లు ఈసీ తెలిపింది. అయితే ఇంకా 2796 గుర్తింపు లేని రాజకీయ పార్టీలున్నట్లు స్పష్టం చేసింది. కానీ.. అడ్రస్ లేని, ఖర్చుల వివరాలు చూపించకుండా దేశవ్యాప్తంగా నమోదైన 198 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే.. రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు అందుకున్న విరాళాలకు సంబంధిత దేశ వ్యాప్తంగా 2017 నుంచి 2018లో 1,897 ఆర్ యూపీపాలు, 2018 నుంచి 19 లో2,202, 19,20లో 2,351, 2020,21లో 2794 ఆర్ యూపీపీలు కమిషన్ కు వివరాలు అందించలేదని పేర్కొంది. విరాళాల వివరాలు సమర్పించకుండా ఆదాయ పన్ను మినహాయింపు పొందిన 66 గుర్తింపు పొందిన పార్టీల సమాచారాన్ని కూడా ఈసీ సేకరించారని తెలిపారు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే పార్టీలను రిజిస్టర్ చేస్తున్నారని ఈసందర్భంగా ఈసీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
India vs England : దుమ్ములేపిన హర్దిక్ పాండ్యా.. భారత్ ఘన విజయం
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!