Rain Mud: వాన తగ్గింది.. బురద మిగిలింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Mud: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వానలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. పునరావాస కేంద్రాలు, కొండలపైకి, ఇళ్లపై వెళ్లి తల దాచుకున్న బాధితులు ఇళ్లను చూసి చలించిపోయారు. వారం రోజులుగా వరద నీటిలో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయి గోడలు నిలిచిపోయాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఒండ్రుమట్టి పేరుకుపోయి చెట్లు కూలిపోవడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. మిగిలిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రతి గ్రామంలో రోడ్లు ధ్వంసమై బతకలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Telangana Congress: జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామాల ప్రజలు స్వగ్రామాలకు చేరుకుని ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే విద్యుత్తు సరఫరా ఉన్నా మోటార్లు నీటిలో తడిసి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఇంట్లోని విలువైన వస్తువులు తడిసి పనికిరాని స్థితిలో ఉన్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పునరుద్ధరణ కాలేదని, ఆస్తినష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న మాకు ఇలాంటి ఆపద వస్తే అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు. ఇళ్లంతా బురద, చెత్తతో నిండిపోయిందని చేతులతో బురదను ఎత్తి ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంతలా వానలు మొదటి సారి వచ్చాయని అన్నారు. ఇంట్లో బురదల వల్ల దోమలు వ్యాపించి అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంటి మరమ్మతులు, ఇంటిని శుభ్రం చేయడం, వస్తువులను తరలించడం వంటి వాటికి పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇళ్లు కూలిన వారికి ప్రభుత్వం ప్రత్యేక పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.
TS Rains: తెలంగాణలో వర్ష బీభత్సం.. రికార్డు బద్దలు కొట్టిన వర్షపాతం
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!