Rain Mud: వాన తగ్గింది.. బురద మిగిలింది
Rain Mud: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వానలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. పునరావాస కేంద్రాలు, కొండలపైకి, ఇళ్లపై వెళ్లి తల దాచుకున్న బాధితులు ఇళ్లను చూసి చలించిపోయారు. వారం రోజులుగా వరద నీటిలో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయి గోడలు నిలిచిపోయాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఒండ్రుమట్టి పేరుకుపోయి చెట్లు కూలిపోవడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. మిగిలిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రతి గ్రామంలో రోడ్లు ధ్వంసమై బతకలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Telangana Congress: జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామాల ప్రజలు స్వగ్రామాలకు చేరుకుని ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే విద్యుత్తు సరఫరా ఉన్నా మోటార్లు నీటిలో తడిసి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఇంట్లోని విలువైన వస్తువులు తడిసి పనికిరాని స్థితిలో ఉన్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పునరుద్ధరణ కాలేదని, ఆస్తినష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న మాకు ఇలాంటి ఆపద వస్తే అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు. ఇళ్లంతా బురద, చెత్తతో నిండిపోయిందని చేతులతో బురదను ఎత్తి ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంతలా వానలు మొదటి సారి వచ్చాయని అన్నారు. ఇంట్లో బురదల వల్ల దోమలు వ్యాపించి అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంటి మరమ్మతులు, ఇంటిని శుభ్రం చేయడం, వస్తువులను తరలించడం వంటి వాటికి పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇళ్లు కూలిన వారికి ప్రభుత్వం ప్రత్యేక పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.
TS Rains: తెలంగాణలో వర్ష బీభత్సం.. రికార్డు బద్దలు కొట్టిన వర్షపాతం
తాజావార్తలు
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!