Rain Mud: వాన తగ్గింది.. బురద మిగిలింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Mud: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వానలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. పునరావాస కేంద్రాలు, కొండలపైకి, ఇళ్లపై వెళ్లి తల దాచుకున్న బాధితులు ఇళ్లను చూసి చలించిపోయారు. వారం రోజులుగా వరద నీటిలో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయి గోడలు నిలిచిపోయాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఒండ్రుమట్టి పేరుకుపోయి చెట్లు కూలిపోవడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. మిగిలిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రతి గ్రామంలో రోడ్లు ధ్వంసమై బతకలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Telangana Congress: జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
Also Read
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామాల ప్రజలు స్వగ్రామాలకు చేరుకుని ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే విద్యుత్తు సరఫరా ఉన్నా మోటార్లు నీటిలో తడిసి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఇంట్లోని విలువైన వస్తువులు తడిసి పనికిరాని స్థితిలో ఉన్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పునరుద్ధరణ కాలేదని, ఆస్తినష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న మాకు ఇలాంటి ఆపద వస్తే అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు. ఇళ్లంతా బురద, చెత్తతో నిండిపోయిందని చేతులతో బురదను ఎత్తి ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంతలా వానలు మొదటి సారి వచ్చాయని అన్నారు. ఇంట్లో బురదల వల్ల దోమలు వ్యాపించి అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంటి మరమ్మతులు, ఇంటిని శుభ్రం చేయడం, వస్తువులను తరలించడం వంటి వాటికి పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇళ్లు కూలిన వారికి ప్రభుత్వం ప్రత్యేక పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.
TS Rains: తెలంగాణలో వర్ష బీభత్సం.. రికార్డు బద్దలు కొట్టిన వర్షపాతం
తాజావార్తలు
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!