HYD Metro: మెట్రో స్టేషన్ల కిందే సిట్టింగ్.. అడ్డంగా బుక్కైన మందుబాబులు
HYD Metro: నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలో పబ్లిక్ ప్లేసులే అడ్డాగా మార్చుకుంటు మందు కొడుతున్నారు. మనల్ని ఎవర్రా ఆపేది అంటూ మెట్రో, జనావాసాల్లో మందు తాగుతూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. కాగా.. హైదరాబాద్ మెట్రో నిత్యం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. చిన్న వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరంలోని ఒక మూల నుంచి మరో మూలకు ప్రయాణించే కుటుంబాలకు ఇది సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే ఇలాంటి మెట్రో స్టేషన్లు కొన్ని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డంకులుగా మారుతున్నాయి. యువ జంటల లిఫ్ట్లో టిక్ టాక్ డ్యాన్స్లు, ఇన్స్టా రీల్స్, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి ఘటనలు మహానగరాల్లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల అభ్యర్థన మేరకు మెట్రో అధికారులు ఇలాంటి మోసాలపై సీరియస్గా చర్యలు తీసుకుని తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.
Read also: Rajinikanth’s Jailer: రజినీతో అట్లుంటది మరి.. ఉద్యోగుల కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసిన సీఈఓ!
Also Read
ఇదిలా ఉండగా మెట్రో స్టేషన్ల పరిధిలో మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పంజాగుట్ట మెట్రో స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు పట్టపగలు గ్లాసుల్లో మందు కలిపి దర్జా తాగుతున్న వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అది మరిచిపోకముందే యూసుఫ్గూడ మెట్రో స్టేషన్ పరిధిలో కూడా కొందరు యువకులు పట్టపగలు డ్రగ్స్ సేవిస్తున్నారు. స్టేషన్ కి ఇరువైపులా ఏర్పాటు చేసిన బెంచీల మీద దర్జాగా కూర్చున్నాడు. మెట్రో స్టేషన్లంటే పర్మిట్ రూమ్స్ అని భావించి సిగ్గు లేకుండా మందు కొడుతున్నారు. పక్కనే గుడి ఉన్నప్పటికీ.. అటుగా వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీరువా తాగి చల్లబరుస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిని చూసిన పలువురు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల నిర్వహణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర వైన్స్, బార్లు ఉండడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్ల కింద కూర్చున్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే బాలికలతో పాటు కూలి పనులకు వెళ్లే మహిళలు, కుటుంబ సమేతంగా వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Rajini Kanth: నీలాంబరి ముందు నా పరువు తీసేశావు కదా.. డైరెక్టర్
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!