HYD Metro: మెట్రో స్టేషన్ల కిందే సిట్టింగ్.. అడ్డంగా బుక్కైన మందుబాబులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD Metro: నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలో పబ్లిక్ ప్లేసులే అడ్డాగా మార్చుకుంటు మందు కొడుతున్నారు. మనల్ని ఎవర్రా ఆపేది అంటూ మెట్రో, జనావాసాల్లో మందు తాగుతూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. కాగా.. హైదరాబాద్ మెట్రో నిత్యం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. చిన్న వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరంలోని ఒక మూల నుంచి మరో మూలకు ప్రయాణించే కుటుంబాలకు ఇది సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే ఇలాంటి మెట్రో స్టేషన్లు కొన్ని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డంకులుగా మారుతున్నాయి. యువ జంటల లిఫ్ట్లో టిక్ టాక్ డ్యాన్స్లు, ఇన్స్టా రీల్స్, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి ఘటనలు మహానగరాల్లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల అభ్యర్థన మేరకు మెట్రో అధికారులు ఇలాంటి మోసాలపై సీరియస్గా చర్యలు తీసుకుని తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.
Read also: Rajinikanth’s Jailer: రజినీతో అట్లుంటది మరి.. ఉద్యోగుల కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసిన సీఈఓ!
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ఇదిలా ఉండగా మెట్రో స్టేషన్ల పరిధిలో మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పంజాగుట్ట మెట్రో స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు పట్టపగలు గ్లాసుల్లో మందు కలిపి దర్జా తాగుతున్న వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అది మరిచిపోకముందే యూసుఫ్గూడ మెట్రో స్టేషన్ పరిధిలో కూడా కొందరు యువకులు పట్టపగలు డ్రగ్స్ సేవిస్తున్నారు. స్టేషన్ కి ఇరువైపులా ఏర్పాటు చేసిన బెంచీల మీద దర్జాగా కూర్చున్నాడు. మెట్రో స్టేషన్లంటే పర్మిట్ రూమ్స్ అని భావించి సిగ్గు లేకుండా మందు కొడుతున్నారు. పక్కనే గుడి ఉన్నప్పటికీ.. అటుగా వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీరువా తాగి చల్లబరుస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిని చూసిన పలువురు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల నిర్వహణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర వైన్స్, బార్లు ఉండడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్ల కింద కూర్చున్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే బాలికలతో పాటు కూలి పనులకు వెళ్లే మహిళలు, కుటుంబ సమేతంగా వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Rajini Kanth: నీలాంబరి ముందు నా పరువు తీసేశావు కదా.. డైరెక్టర్
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!