Rajini Kanth: నీలాంబరి ముందు నా పరువు తీసేశావు కదా.. డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajini Kanth:గత కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో రజనీ కాంత్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో తన నెక్ట్స్ మూవీపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఆయన ఫ్యాన్స్ కూడా డిప్రెషన్లో ఉన్నారు. వీటిన్నింటి నడుమ ఇక నేడు విడుదలైన జైలర్ మూవీ థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అందుకు కారణం ఫస్ట్ షో నుంచి తలైవా కమ్ బ్యాక్ అన్న టాక్ నడుస్తోంది. దీంతో భారీ హిట్ ఖాయమని తెలుస్తోంది. సినిమాలో రజనీ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని టాక్. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన నువ్వు కావాలయ్యా సాంగ్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. సినిమా హిట్ కావడానికి సాంగ్స్ కూడా కారణమే. తప్పకుండా రజినీ జైలర్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. ఈ సినిమాలో రజనీతో తమన్నా, రమకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్కుమార్ వంటి స్టార్స్ నటించారు. రజినీ సినిమాను పురస్కరించుకుని మెట్రో నగరాల్లో అన్ని కంపెనీలు ఆఫీసులకు హాలీడేస్ ప్రకటించాయి.
Read Also:Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేసింది. ఈ క్రమంలో చెన్నై ఆడియో లాంచ్ నిర్వహించారు. అందులో రజినీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ లో రజినీ తన పరువును హీరోయిన్ ముందు డైరెక్టర్ తీసేశాడని వాపోయాడు. జైలర్ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ రజినీ నటించే ఓ సీన్ ఫర్ ఫెక్ట్ గా రాలేదట. ఈ సీన్ కోసం రజినీ 8టేకులు తీసుకున్నాడట. దీంతో రజనీ హర్ట్ అయి నీలాంబరి ముందు నరసింహ పరువుతీసేశావు అంటూ ఆడియో లాంఛింగ్ వేడుకపై అభిమానుల ముందు సరదగా అన్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజినీకాంత్ కు భార్యగా నటించింది. నరసింహ సినిమా తర్వాత వీరు కలిసి నటించ లేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రమ్యతో కలిసి రజనీ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు.
Read Also:Manipur MLAs: మణిపూర్ అల్లర్లపై మోడీతో భేటీ అయ్యేందుకు 40 మంది ఎమ్మెల్యేల ప్రయత్నాలు
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!