Fake Messages: వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మెసేజ్.. స్పందించారో దోచేస్తారు.!
Fake Messages: నిరుద్యోగ యువతే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వారికి గాలం వేస్తూ వేలల్లో దోచుకుంటున్నారు. దీనికి ఆకర్షితులైన యువత డబ్బులు పోగొట్టుకుని లబోదిబో మంటా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్లో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనల్లో ఏది నిజమో, ఏది నకిలీదో తెలియని గందరగోళం నెలకొంది. ప్రధానంగా ఉద్యోగం కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఈ ఉచ్చులో పడుతున్నారు.
ఇటీవల ఓ యువతిని వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫారమ్ ద్వారా నకిలీ వెబ్సైట్ లింక్ను పంపడం ద్వారా సుమారు రూ. లక్ష వరకు చెల్లించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నిజాంపేటకు చెందిన నవ్యశ్రీ అనే యువతి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఈనెల 2న నవ్యశ్రీకి ఇన్స్టాగ్రామ్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ జాబ్ పేరుతో లింక్ పంపాడు. లింక్ ఓపెన్ చేసి కొన్ని పనులు చేస్తే డబ్బులు వస్తాయని నమ్ముతున్నారు. నిజమే అనుకున్న నవ్యశ్రీ లింక్ ఓపెన్ చేసి వారు ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేసింది. అయితే దీని కోసం ముందుగా కొంత డబ్బు చెల్లించాలని, తాము చెల్లించిన దానికంటే ఎక్కువ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. అది నిజమని నమ్మిన యువతి మొత్తం రూ. ఆలోచించకుండా ఏడు విడతల్లో రూ.91,100 ఆమె ఖాతా నుంచి పంపించారు. డబ్బు పంపిన తర్వాత అవతలి వైపు నుంచి వచ్చిన స్పందన ఒక్కసారిగా షాక్ తిన్నారు.
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
Read also: Palakurthy Thikkareddy: అందరికీ అండగా ఉండాలనే లోకేష్ శంఖారావం పూరించబోతున్నారు..
అంతకు రెట్టింపు ఇస్తామని చెప్పిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. తాను పంపిన డబ్బును వెంటనే వెనక్కి పంపాలని కోరింది. అవతలి వ్యక్తి రూ.83 వేలు పన్ను చెల్లిస్తే తిరిగి ఖాతాలో డబ్బులు వస్తాయని బదులిచ్చారు. మోసపోయానని భావించిన బాధితురాలు అదే రోజు సైబర్ క్రైమ్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. ఉద్యోగం కోసం వెతుకులాటలో చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా కోల్పోయే దుస్థితి నెలకొంది. అందుకే తస్మాత్ జాగ్రత్త! వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్న యువతీ, యువకులు తాము చూసే ఆకర్షణీయమైన ప్రకటనలన్నీ నిజమేనని నమ్మి మోసపోకూడదని సూచించారు.
PM MODI: బీజేపీకి ఒంటరిగానే 370 పైగా ఎంపీ సీట్లను గెలుస్తుంది..
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!