Fake Messages: వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మెసేజ్.. స్పందించారో దోచేస్తారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Messages: నిరుద్యోగ యువతే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వారికి గాలం వేస్తూ వేలల్లో దోచుకుంటున్నారు. దీనికి ఆకర్షితులైన యువత డబ్బులు పోగొట్టుకుని లబోదిబో మంటా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్లో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనల్లో ఏది నిజమో, ఏది నకిలీదో తెలియని గందరగోళం నెలకొంది. ప్రధానంగా ఉద్యోగం కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఈ ఉచ్చులో పడుతున్నారు.
ఇటీవల ఓ యువతిని వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫారమ్ ద్వారా నకిలీ వెబ్సైట్ లింక్ను పంపడం ద్వారా సుమారు రూ. లక్ష వరకు చెల్లించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నిజాంపేటకు చెందిన నవ్యశ్రీ అనే యువతి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఈనెల 2న నవ్యశ్రీకి ఇన్స్టాగ్రామ్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ జాబ్ పేరుతో లింక్ పంపాడు. లింక్ ఓపెన్ చేసి కొన్ని పనులు చేస్తే డబ్బులు వస్తాయని నమ్ముతున్నారు. నిజమే అనుకున్న నవ్యశ్రీ లింక్ ఓపెన్ చేసి వారు ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేసింది. అయితే దీని కోసం ముందుగా కొంత డబ్బు చెల్లించాలని, తాము చెల్లించిన దానికంటే ఎక్కువ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. అది నిజమని నమ్మిన యువతి మొత్తం రూ. ఆలోచించకుండా ఏడు విడతల్లో రూ.91,100 ఆమె ఖాతా నుంచి పంపించారు. డబ్బు పంపిన తర్వాత అవతలి వైపు నుంచి వచ్చిన స్పందన ఒక్కసారిగా షాక్ తిన్నారు.
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
Read also: Palakurthy Thikkareddy: అందరికీ అండగా ఉండాలనే లోకేష్ శంఖారావం పూరించబోతున్నారు..
అంతకు రెట్టింపు ఇస్తామని చెప్పిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. తాను పంపిన డబ్బును వెంటనే వెనక్కి పంపాలని కోరింది. అవతలి వ్యక్తి రూ.83 వేలు పన్ను చెల్లిస్తే తిరిగి ఖాతాలో డబ్బులు వస్తాయని బదులిచ్చారు. మోసపోయానని భావించిన బాధితురాలు అదే రోజు సైబర్ క్రైమ్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. ఉద్యోగం కోసం వెతుకులాటలో చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా కోల్పోయే దుస్థితి నెలకొంది. అందుకే తస్మాత్ జాగ్రత్త! వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్న యువతీ, యువకులు తాము చూసే ఆకర్షణీయమైన ప్రకటనలన్నీ నిజమేనని నమ్మి మోసపోకూడదని సూచించారు.
PM MODI: బీజేపీకి ఒంటరిగానే 370 పైగా ఎంపీ సీట్లను గెలుస్తుంది..
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..